Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nominations closed : ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల తొలి అంకం

–ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 23 మం ది అభ్యర్థులు 50 నామినేషన్లు

–ఈ నెల 27న పోలింగ్ 12 జిల్లాల పరిధిలో 200 పోలింగ్ స్టేషన్ లు

Nominations closed : ప్రజా దీవెన నల్లగొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగి సింది. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా 3వ తే దీన వెలువడింది. ఉమ్మడి వరంగ ల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలలోని 12 జిల్లాలు, 191 మండలాలు ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి రానుం డగా పోటీ చేసే అభ్యర్థులు నల్లగొం డ కలెక్టరేట్లో నామినేషన్లను సమ ర్పించారు.

 

 

ఈనెల 3 తేదీ నుండి చివరి రోజైన 10వ తేదీ వరకు మొత్తం 23 మంది అభ్యర్థులు 50 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేడు నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంట ల వరకు 200 పోలింగ్ కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగ నుoడగా 3న ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

 

భారీగా దాఖలైన నామినే షన్లు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా చివరి రోజై న సోమవారం 18 మంది అభ్యర్థు లు 27 సెట్ల నామినేషన్లను దాఖ లు చేసినట్లు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొం డ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలి పారు. సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో భారతీయ జనతా పార్టీ తరఫున పులి సరో త్తమ్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ దాఖ లు చేశారని, లింగిడి వెంకటేశ్వర్లు ప్రజావాణి పార్టీ తరఫున 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేసినట్లు కలె క్టర్ తెలిపారు.

 

 

ప్రజా ఏక్తా పార్టీ తర పున బండారు నాగరాజు 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారని వెల్ల డించారు. దామెర బాబురావు, ఏలే చంద్రమోహన్, పింగిలి శ్రీ పాల్, ఎస్. సుందర్రాజు, పూల రవీందర్, డాక్టర్ కొల్లిపాక వెంక టస్వామి, తలకోల పురుషోత్తం రెడ్డి లు స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కొక్కరు 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, తాటికొండ వెంకట రాజయ్య, పన్నాల గోపాల్ రెడ్డి, గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, జెట్టి శంకర్, బండారు నాగరాజు, గంగిరె డ్డి కోటిరెడ్డి, తండు ఉపేందర్లు స్వ తంత్ర అభ్యర్థులుగా ఒక్కో నామినే షన్ దాఖలు చేసినట్లు కలెక్టర్ వెల్ల డించారు. నామినేషన్లకు చివరి రోజు పలువురు ముఖ్యులు, ఇండి పెండెంట్ అభ్యర్థులు నామినేష న్లను దాఖలు చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తో కలిసి వచ్చి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్ ను దాఖలు చేశారు.

 


ఇదిలా ఉండగా ఈ నెల 27వ తేదీన జరగనున్న పోలింగ్ కు సంబంధించి ఓటరు తుది జాబి తాను సిద్ధం చేశారు. గతేడాది డిసెంబరు 31వ తేదీ నాటికి ము సాయిదాను విడుదల చేయగా ఆ తరువాత జనవరి 31వ తేదీ వర కు కూడా కొత్త ఓటర్ల నమోదు కు ఎన్నికల సంఘం అవకాశా న్నిచ్చిం ది. దీంతో అప్పుడున్న ఓటర్ల సం ఖ్యకు అదనంగా కొత్త ఓటర్లు వచ్చి చేరారు. దీంతో ఉపాధ్యాయు ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్ల సంఖ్య పెరిగింది. డిసెంబరు 31 నాటికి ఉపాధ్యాయ ఓటర్లు 24905 మం ది ఉండగా నేడు 12 జిల్లాలకు సంబంధించి 25797 మంది ఓటర్లు ఉన్నారు.

 

 

అందులో 15483 మంది పురుష ఓటర్ల కాగా 10314 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నల్లగొం డలోని 4 డివిజన్ల కు సంబంధించి 4683 మంది ఓటర్లు ఉండగా అం దులో పురుష ఓటర్లు 2817 మం ది, 1866 మహిళా ఓటర్లు ఉన్నా రు. మొత్తంగా ఈ ఎన్నికల్లో 12 జిల్లాలలకి సంబంధించి 25797 మంది ఉపాధ్యాయులు ఉపాధ్యా య ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయ నున్నారు. 12 జిల్లాల పరిధిలో ఉన్న 200 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక లను నిర్వహించేందుకు వీలుగా సిబ్బందికి తగిన శిక్షణ అందిస్తు న్నారు. అన్ని జిల్లాల్లో కోడ్ అమలు తోపాటు అభ్యర్థుల ప్రచారాన్ని గమనించేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు.