Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Narayana Amit : దరఖాస్తుల పరిష్కారం పై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలి

–అదనపు కలెక్టర్ నారాయణ అమిత్

Collector Narayana Amit : ప్రజాదీవెన, నల్గొండ: ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఇన్చార్జ్ రెవెన్యూ రెవెన్యూ కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 33 మంది పిర్యాదుదారులు ఫిర్యాదులను సమర్పించారు. ఇందులో 19 వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు రాగా, 14 రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.


ఫిర్యాదుల స్వీకరణ సందర్భంగా ఆయన జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యల పరిష్కారం నిమిత్తం సమర్పించే దరఖాస్తులను జిల్లా అధికారులు ప్రత్యేకంగా పరిశీలన చేయాలని, ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వారి శాఖ పరిధిలో పరిష్కరించేవి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఒకవేళ పై స్థాయిలో ఫిర్యాదు పరిష్కారమయ్యేలా ఉంటే పై స్థాయికి వెంటనే పంపించాలని చెప్పారు..స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజకుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్ డి ఓ శ్రీదేవి, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.