One Day on Earth @ 44 భూమి మీదకు ఒక్క రోజే @ 44
-- ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజే జననాలు -- రికార్డ్ స్థాయిలో పాలమూరు ఆసుపత్రి -- కేసీఆర్ కిట్ పథకం అమలుతో సాధ్యమైందంటున్న వైద్యులు
భూమి మీదకు ఒక్క రోజే @ 44
— ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజే జననాలు
— రికార్డ్ స్థాయిలో పాలమూరు ఆసుపత్రి
— కేసీఆర్ కిట్ పథకం అమలుతో సాధ్యమైందంటున్న వైద్యులు
ప్రజా దీవెన/ మహబూబ్ నగర్: పాలమూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రికార్డ్ సృష్టించింది. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 44 మంది గర్భిణులు ప్రసవించడం సంబ్రమచర్యాలకు గురి చేసింది. కేసీఆర్ కిట్ పథకం విజయవంతంగా అమలుతో ఓకే రోజు 44 మంది శిశువులకు శనివారం రోజు వైద్యులు పురుడు పోశారు.
గర్భిణులంతా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారే అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్ తెలిపారు. 44 మందిలో కొందరికి నార్మల్ డెలివరీ కాగా, ఇంకొందరికి సీజేరియన్లు జరిగాయి.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేటీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ కిట్ పథకం అమలుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగిన విషయం విదితమే. ఇక గర్భిణిలకు నార్మల్ డెలివరీలు చేసేందుకు వైద్యులు ప్రాధాన్యతఇస్తున్నారు. బాలింతలను ఇంటికి తరలించేందుకు అమ్మ ఒడి వాహనాలను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి మెడిసిన్స్ను ఆరోగ్య లక్ష్మి పథకం కింద అందిస్తున్నారు.