Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

National Defence Fund Donation : నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు నెల జీతం

–పాక్ యుద్ధ నీతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది

–ఈ సమయంలో భారత పౌరులు దేశానికి మద్దతుగా నిలబడాలి

–వీర జవాన్ మురళి నాయక్ మృతి బాధాకరం

–శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

National Defence Fund Donation :ప్రజాదీవెన నల్గొండ :రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తన నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఇస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శాసన మండలి సభ్యులు అందరూ కూడా నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి విరాళం ప్రకటించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. శనివారం నల్లగొండలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాకిస్థాన్ తో భారత్ వీరోచిత పోరాటం చేస్తోంది. భారత్ యుద్ధ నీతిని పాటిస్తూ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలపైనే భారతదేశం దాడులు చేస్తోంది.

కానీ పాకిస్థాన్ మాత్రం భారత్ పౌరులపై దాడి చేస్తోందని అన్నారు.పాక్ యుద్ధ నీతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. పీఓకే స్వాధీనం చేసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవని పేర్కొన్నారు. ఈ సమయంలోనే భారత పౌరులు అందరూ దేశానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. వీర జవాన్ మురళి నాయక్ మృతి చాలా బాధాకరం. మురళి నాయక్ కి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.