–బతుకు పోరాటంలో ఒంటరైన బాలిక
Orphan HELP:: ప్రజా దీవెన, భైంసా: విధి వక్రీకరిం చింది. అంతు చిక్కని ఆవేదన విధి రాసిన రాతలో ఒంటరైన ఆ బాలి కది. ఇటీవలే తండ్రి, నిన్న తల్లి మరణం అంత్య క్రియలు (Finite Verbs) సైతం చేయలేని పరిస్థితి ఓ బాలిక. తండ్రి చని పోయిన కొన్ని రోజులకే తల్లి ఆత్మహత్య చేసుకోవ డంతో అనాథగా మిగిలి పోయింది. నిర్మల్ జిల్లా ముధోల్ (Nirmal District Mudhol) తాలూకా తానూ రు మండలం బెల్బరోడా గ్రామంలో నివాసం ఉంటున్న గం గామణి(36) గతకొంతకాలంగా భర్త వదిలి కూలి పనులు చేసుకుంటూ కూతురు దుర్గను పోషించుకుంటూ వస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవలే తండ్రి మరణించగా, నిన్న రాత్రి మనస్తాపంతో తల్లి గంగామణి సైతం ఆత్మహత్య చేసు కున్నది. దీంతో చిన్నారి దుర్గ (11) తల్లి దండ్రులు (PARESNTS)ఇద్దరినీ కోల్పోయింది. కనీసం తల్లి అంత్యక్రియలకు కూడా చేయలేని దుస్థితిలో ఉండటంతో ఇంటి ఎదుట ఓ గుడ్డ వేసుకొని సా యం కోసం ఎదురు చూస్తోంది. ఈ దృశ్యాన్ని చూసి చలించి పోయిన స్థానికులు తలా కొంత ఆర్థిక సా యం చేశారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ (VIRAL) కావడంతో పలువు రు 9676636843355 సహాయం (HELP)అందిస్తున్నారు.