*శిధిలావస్థలో ఉన్న గృహాల్లోకి వెళ్లొద్దు…
*సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా హెల్త్ క్యాంపులు.
*అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
*నిర్వాసితులకు ఆదుకోవాలని పిలుపు. పద్మావతి రెడ్డి..
Padmavathi Reddy: ప్రజా దీవెన, కోదాడ: వరద ప్రభావంతో ఆశ్రయం కోల్పోయిన నిర్వాసితులకు అన్ని గ్రామాలలో శిబిరాలను ఏర్పాటు చేసి వారికి కావాల్సిన మౌలిక సదువులను కల్పించినట్లు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి (Padmavathi Reddy)తెలిపారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో (Press conference) అమె మాట్లాడారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో రెడ్లకుంట తొగర్రాయి, కూచిపూడి, గొండ్రెల, కిష్టాపురం, రంగయ్య గూడెం, నారాయణపురం, బి కే తండా, కోదాడ మున్సిపల్ పరిధిలో 9 వార్డులలో నిర్వాసితులకు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లలో నిర్వాసిత సహాయ కేంద్రాలను స్పెషల్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయని తెలిపారు. వరద కారణంగా సర్వం కోల్పోయిన వారికి భోజనం,త్రాగు నీరు, దుస్తుల తో పాటు పిల్లలకు ఇమ్యూనిటీ మెడిసిన్ ఆడపిల్లల అవసరాలకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గత 100 సంవత్సరాల్లో లేని వర్షపాతం ఇప్పుడు నమోదు కావడం వల్ల ఈ విపత్తు జరిగిందని, అనేక సంవత్సరాలుగా కోదాడ పట్టణంలో ని డ్రైనేజీ చెత్తతో పేరుకుపోయినందువల్ల వర్షపు నీరు రోడ్లపైకి వచ్చిందని తక్షణ ప్రాతిపదికన కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ట్రైన్ ని, నాలా లను ఓపెన్ చేసి మున్సిపల్ డిఈ పర్యవేక్షణలో స్టిల్ట్ (Stilt under the supervision of DE) తొలగిస్తున్నట్లు తెలిపారు. అందుకు వ్యాపారస్తులందరూ సహకరించాలని కోరారు. వరద ముంపు గురైన నిర్వాసితులకు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్తులు, బియ్యం, దుస్తులు, తాగునీరు, మెడిసిన్, తదితర సామాగ్రిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసినట్లయితే అధికారుల పర్యవేక్షణలో నిర్వాసితులకు అందజేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముంపుకు గురైన గ్రామాల్లో భవనాల స్థితిగతులను అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆరోగ్యశాఖ అధికారులు, ఆశా వర్కర్లు, ప్రతి ఇంటికి వెళ్లి ముందస్తుగా సీజనల్ వ్యాధులు ప్రజల కుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అధికారిక లెక్కల ప్రకారం నియోజకవర్గ పరిధిలో సుమారు 26 కిలోమీటర్ల పరిధి ఆర్ఎంబి రోడ్లు, పంచాయతీరాజ్ (RMB Roads, Panchayat Raj)పరిధిలో 13 రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇరిగేషన్ పరిధిలో ఎంబీసీ కెనాల్, ఆర్కే మేజర్, నారాయణపురం ఊర చెరువు, రామచంద్రపురం సాగర్ కెనాల్, పాలు అన్నారం శివ దేవుని కుంట చెరువు, చెరువు కట్టలు తెగిపోయినట్లు తెలిపారు. విద్యుత్ శాఖలో 33 కేవీ 15 లైన్లు, 11 కేవీ 1000 స్తంభాలు, ఎల్ టీ 1001 స్తంభాలు, సుమారు 350 ట్రాన్స్ఫార్మర్లు (Transformers) నీట మునిగి డ్యామేజ్ అయినట్లు తెలిపారు. పునరుద్ధరణకు తక్షణ సహాయ నిధి ద్వారా అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ ని కోరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు, కౌన్సిలర్లు షాబుద్దీన్, కర్రీ శివ సుబ్బారావు, గంధం యాదగిరి, ఎస్ కే షఫీ, వంటి పులి శ్రీను, నెమ్మది దేవమణి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.