Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Padmavathi Reddy: నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

ప్రజా దీవెన, కోదాడ: కోదాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కోదాడ శాసన సభ్యురాలు నలమాధ పద్మావతి రెడ్డి అన్నాడు ఆదివారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా 22 లక్షల రూపాయలు నిధులతో నిర్మించిన నాలుగు దుకాణాల సముదాయాన్ని ప్రారంభించారు.

నూతనంగా నిర్మిస్తున్న గుడిబండ గ్రామపంచాయతీ కార్యాలయానికి కాలనీలో రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే కాపుగల్లు గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 1000 మెట్రిక్ టన్నుల గోదాములు ప్రారంభించారు అనంతరం పిఎసిఎస్ చైర్మన్ నంబూరు సూర్యం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు కాపుగల్లు నూతన మండలం ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు. కాపుగల్లు గ్రామంలో సర్వేశ్వరం గ్రామంలో సన్మానవాటి లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి కాపుగల్లు మాజీ సర్పంచ్ తొండపు సతీష్ తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి మండలంలో ఉన్న సొసైటీల, రోడ్లు, గ్రామపంచాయతీ నూతన భవనాలక ఏర్పాటుకు, మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ అయ్యేందుకు బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ప్రభుత్వ భూములను అధికారులు గుర్తించాలని ఆదేశించారు గ్రామాలలో గ్రామసభల ద్వారా వాటిని అర్హులై వారికి ఇచ్చే విధంగా చూస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్, ముత్తారపు పాండురంగారావు, పారి సీతయ్య, వరప్రసాద్ రెడ్డి, సీతారాం రెడ్డి వెంకటేశ్వరరావు పిఎసిఎస్ చైర్మన్ లు ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, కొత్త రఘుపతి, నంబూరు సూర్యం, మదన్ ,జబ్బర్, ప్రసాద్ ,పూర్ణ, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు