Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PadyTransport : ధాన్యం త్వరితగతిన మిల్లులకు చేర్చాలి

జిల్లా అదనపు కలెక్టర్

పి రాంబాబు

PadyTransport: ప్రజా దీవెన, సూర్యాపేట :కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పేర్కొన్నారు.శుక్రవారం సూర్యాపేట మండలం లోని రాయినిగూడెం 2,టేకుమట్ల 2 మెప్మా ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను జిల్లా అదనపు కలెక్టర్ పి రాం బాబు సందర్శించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు రాయి నిగూడెం 2 నుండి 4743.20 క్వింటాల ధాన్యం, టేకుమట్ల 2 కొను గోలు కేంద్రం నుండి 6948.8 క్వింటాలు ధాన్యం తరలించడం జరి గిందని తెలిపారు.రైతులు తాలు లేకుండా శుభ్రమైన ధాన్యాన్ని కొను గోలు కేంద్రాలకి తీసుకోనిరావాలని తేమ శాతం 17రాగానే సీరియల్ ప్రకారం కాంట వేసి మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూ చించారు.

గాలి దుమ్ము, ఆకాల వర్షాలు పడుతున్నందున వడ్లు తడవకుండా టార్పాలిన్ పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ఇన్చార్జిలు గౌతమి,ఫణిమా, సరిత తదితరులు పాల్గొన్నారు.