Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Panchayat Elections : తొంభై రోజుల్లో తప్పనిసరిగా పంచాయతీ ఎన్నికలు

–కీలక తీర్పు వెలువరించిన తెలం గాణ హైకోర్టు
— స్పష్టమైన ఆదేశాలిచ్చిన న్యా యమూర్తి జస్టిస్‌ మాధవీదేవి
— ఇక సమరానికి సన్నద్ధం కానున్న రాజకీయ పార్టీలు

Panchayat Elections : ప్రజా దీవెన, హైదరాబాద్‌ : తెలంగా ణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎ ప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు న్న వారికి తీపి కబురు అందించింది రాష్ట్ర హైకోర్టు. స్థానిక సంస్థలకు గ త ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ప్ర భుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువ రించింది. మూడు నెలలలోపు ఎ న్నికలు నిర్వహించాలని జస్టిస్‌ మా ధవీదేవి ఆదేశించారు.
హైకోర్టులో కేసు విచారణ నేపద్యం లో కోర్టు వెలువరించిన తీర్పు పూ ర్వాపరాలు ఇలా ఉన్నాయి. నల్ల గొండ జిల్లా మల్లెపల్లి సర్పంచ్‌ పా ర్వతి, కుర్మపల్లి సర్పంచ్‌ శ్రీనివాస్‌, జనగామ జిల్లా కాంచనపల్లి సర్పం చ్‌ విజయ, నిర్మల్‌ జిల్లా తల్వెడ స ర్పంచ్‌ అనిల్‌కుమార్‌, కరీంనగర్‌ జిల్లా చంగర్ల సర్పంచ్‌ వేణుగోపాల్‌, నిజాయతీ గూడెం సర్పంచ్‌ మురళీ ధర్‌ వేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యా యి. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ టీ మాధవీదేవి బుధవారo తీర్పు ఇచ్చారు.

రాజ్యాంగంలోని 243ఈ, 243కే అధికరణాలను, తెలంగాణ గ్రామ పంచాయతీరాజ్‌ చట్టం 2018 ని బంధనలను ప్రభుత్వం ఉల్లంఘిం చిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగు ణంగా వెనుకబడిన తరగతుల రి జర్వేషన్లను ఖరారు చేసేందుకు మ రో 30 రోజుల గడువు కావాలని ప్ర భుత్వం వాయిదా కోరింది.గత వి చారణలో కూడా ఇదే తరహాలో వా యిదా కోరిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ వాయిదా కోరడం ఏమిటని హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేందకు డెడికేటెడ్‌ బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశామని, బీసీ రిజర్వేషన్లను ఖరా రు చేయడమే తమ ముందున్న అంశమని ప్రభుత్వం వివరణ ఇ చ్చింది.ప్రభుత్వం నుంచి అను మ తి లభించాక ఎన్నికల నిర్వహణ కు తమకు రెండు మాసాల వ్యవధి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ వాదనలు సోమవారం ముగియడంతో బుధవారం హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

తీర్పు పూర్వాపరాలు ఇలా ఉ న్నాయి… తెలంగాణలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వివరించింది. 90 రో జు ల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్ర భుత్వాన్ని ఆదేశించింది. 30 రోజు లు సమయం కావాలని ప్రభుత్వం కోరగా ఎలక్షన్ కమిషన్ 60 రోజుల సమయం కోరిన నేప ద్యంలో ఈ సందర్భంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్‌ మాధవి బెంచ్‌ ధ ర్మాసనం మూడు నెలల్లో ఎన్నికల ను నిర్వహించాలని పేర్కొంది. ఎన్నికల నిర్వహణపై నల్గొండ జిల్లా సర్పం చులు పిటిషన్లు వేసిన విష యం తెలిసిందే.

కాగా స్థానిక సంస్థల ఎన్నికల పిటి షన్‌పై తెలంగాణ హైకోర్టు సోమ వారం విచారణ జరిపింది. ఆరు నె లల తర్వాత స్థానిక సంస్థల ఎ న్నికల కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వినిపించారు. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహి స్తుందో చెప్పాలని హైకోర్టు పిటీషన ర్లను ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభు త్వం హామీ ఇచ్చిందని ఎందుకు ఎ న్నికలు నిర్వహించలేదని న్యాయ స్థానం నిలదీసింది. తెలంగాణ రా ష్ట్రంలో కులగణన సర్వే ఇంకా పూ ర్తి అవ్వలేదని కొంత సమయం కావాలని కోర్టుని ప్రభుత్వం కోరింది.
ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎ లక్షన్ కమిషన్ అడిగింది. ఎన్నికలై నా పెట్టాలని లేదా పాత సర్పంచ్‌ల నే కొనసాగించాలని పిటీషనర్లు వా దనలు వినిపించారు. ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధ న ఉందని కానీ ప్రభుత్వం ఈ ఎన్ని కలు నిర్వహించలేదని పిటీషనర్లు వాదనలు వినిపించారు. స్థానిక సం స్థల ఎన్నికలపై పిటీషనర్లు, ప్రభు త్వం, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాద నలు విన్న తెలంగాణ హైకోర్టు తీ ర్పు బుధవారం నాటికి రిజర్వ్ చే సింది. 2024 ఫిబ్రవరి 1వ తేదీన తె లంగాణ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.