Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pandiri Nagi Reddy : వేసవి సెలవుల్లో విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి: నాగిరెడ్డి

Pandiri Nagi Reddy : ప్రజా దీవెన ,కోదాడ: వేసవి సెలవులకు కళాశాలను వదిలి వెళుతున్న విద్యార్థులు ఇంటి వద్ద పోటీ పరీక్షలకు సిద్ధమై మంచి ఫలితాలు సాధించాలని ఎమ్మెస్ విద్యాసంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు పట్టణములోని స్థానికకోదాడ యం యస్ జూనియర్ కళాశాల లో గురువారం విద్యార్థులు పరీక్షలు ముగించుకొని వెళ్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథి పాల్గొని ఆయన మాట్లాడుతూకళాశాల విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని,ఇంటివద్ద పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని తెలిపారు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యం యస్ విద్యా సంస్థల సీ ఈ వో యస్ యస్ రావు,యం యస్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రసాద్,వైవిరెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పి.గంగాధర్,అధ్యాపకులు విజయ భాస్కర్,వెంకట రెడ్డి,కల్పన,సునీత,వీరస్వామి, ఇనుద్ధీన్,శ్రీనివాసరావు,రహీమ్, బాలకృష్ణ,పాషా పలువురు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.