Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

Pastor Praveen : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి జిల్లా కొవ్వూరు సమీపంలో రెవరెండ్ డాక్టర్ ప్రవీణ్ పగడాల పాస్టర్ ను అతి దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించి వారి కుటుంబన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని నలగొండ యునైటెడ్ క్రిస్టియన్స్ నల్గొండ అసోసియేషన్ నాయకులు టిఎస్ క్రిస్టఫర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ క్లాక్ టవర్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సిసి ఫుటేజ్ లను భద్రపరిచి వారిలో ఉన్న నిందితులను ఎంతటి వారైనా శిక్షించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

ఇలాంటి పాషావిక చర్యలు, అనాగరిక చర్యలు కొనసాగకుండా తగిన బుద్ధి చెప్పాలని రెండు రాష్ట్రాలలో ఇలాంటి హత్యలు ఇంతవరకు జరగలేదని ఇకపై ఇలాంటి హత్యలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచ క్రైస్తవులంతా ఈ ఘటనను ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు రేకల భద్రాద్రి, ఏఐసిసి స్టేట్ పొలిటికల్ జనరల్ సెక్రెటరీ పసల శౌరయ్య, పాస్టర్లు బి. ప్రవీణ్ కుమార్, కట్ట మోజెస్, జాకబ్, బి. ప్రదీప్, సామ్యూల్, ఆశీర్వాదం, అభిషేక్ పాల్, ఆర్. కిరణ్ కుమార్, ఐజాక్ రామ్, సాలమన్, సుందర్, కత్తుల సంజీవ, మోహన్ రావు, నతానియల్, శాంసన్, ఆశయ్య, ప్రవీణ్ కుమార్, జేమ్స్, ఆనందం, ఎస్పీ జయప్రకాష్, ఆర్ పి అబ్రహం, జెడి పాల్ తదితరులు పాల్గొన్నారు.