Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Phone Tapping : కీలక అప్డేట్, ఫోన్ ట్యాపింగ్ కేసు లో మరో కీలక పరిణామం

Phone Tapping : ప్రజా దీవెన, హైద‌రాబాద్: దేశ వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోమారు ఒక కీలక పరిణామం చోటు చేసుకుం ది. విదేశాల్లో తలదాచుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుల ను తీసుకువచ్చి విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేప ట్టింది. ఈ క్రమంలో ప్రధాన నింది తుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకరరావు, మరో ముఖ్య నిందితుడు అరువెల్ల శ్రవణ్‌రావుల పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చే యడం గమనార్హం. ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ (ఇంటర్ పోల్) నుంచి సీబీఐ ద్వారా తెలం గాణ సీఐడీకి సమాచారం అందిం ది.

 

వారిద్దరినీ వీలైనంత త్వరగా తీసుకొచ్చే విషయంపై కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా హైదరాబాద్ పోలీసులు సంప్రదిం పులు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు అంశం యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)కు చేరితే వారిద్దరినీ అమెరికాలో ప్రొవిజినల్ (తాత్కాలిక) అరెస్టు చేసి డిపోర్టే షన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపే అవకాశం ఉంది. కాగా ప్రొవిజినల్ అరెస్టును వారు అక్కడి న్యాయస్థా నంలో సవాల్ చేసే అవకాశాలు ఉ న్నట్లు కనిపిస్తోoది. నిందితుల పిటి షన్‌ను అక్కడి న్యాయస్థానం పరిగ ణనలోకి తీసుకోవచ్చని భావిస్తు న్నారు. ఒకవేళ అక్కడి న్యాయస్థా నంలో వారికి ఊరట లభించకపోతే మాత్రం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపే అవకాశాలు ఉం టాయని తెలుస్తోంది.