సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 26 సెల్ ఫోన్లు రికవరీ
ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరి ధిలో నమోదైన మొబైల్ మి స్సింగ్ కేసులలో సీఈఐఆర్ పోర్టల్ ( CEIR Portal) ద్వారా నెల రోజు ల పరిధిలో వివిధ ప్రాంతాలలో ఉన్న 26 ఫోన్లను రికవరీ చేసి, మొబైలు ఫోన్ల ( mobil phone s) నిజమైన యాజమానులకి అప్పగించటం జరిగినది.
మొబైల్ ఫోన్లు తీసుకున్న యజమానులు పోయిన ఫోన్లు పిర్యాదు చేసినా దొరకవని అనుకున్నాము, కానీ నల్గొండ వన్ టౌన్ పోలీసు లు మా అనుమానల ని పటాపంచలు చేసి శెభాస్ నల్గొండ వన్ టౌన్ పోలీస్ అనే విధంగా చేస్తూ ఫోన్లని రికవరీ చేసినారని చెప్తూ నల్గొం డ వన్ టౌన్ పోలీసు (police) లకి కృతజ్ఞతలు తెలియ జేశారు.
అనంతరం నల్గొండ డి. ఎస్. పి కె శివరామ్ రెడ్డి ( dsp Shiva ra mreddy) మాట్లాడుతూ మొబైలు ఫోన్లు రికవరీ చేయడంలో కృషి చేసిన నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ( ci rajashekhar reddy), సిబ్బంది ఎం. ఏ ఫరూక్, కిరణ్ కుమా ర్ లను అభినందించారు. తదుపరి, నల్గొండ వన్ టౌన్ ఇన్స్పె క్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో మొబై లు ఫోన్ అనేది మనిషి నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపో యిందన్నారు.
కాబట్టి ఫోన్ పోయింది అన్న విషయం తెలియగానే వెంటనే మీ సి మ్ ను బ్లాక్ చేసి, సమీప పోలీస్ స్టేషన్ ( police station ) పి ర్యాదు చేయడం వల్ల ఫోన్ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా బ్లాక్ చేసి మీ ఫోన్ లో ఉన్న డాటా వేరే వాళ్ళ చేతుల్లోకి పోకుండా ఉంటుందని తెలియజేశారు. అదే విధంగా, సిఈ ఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చి న తర్వాత మొబైలు ఫోన్ దొంగతనాలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలియజేశారు.
Phones recovery police