Photographer Vijay : ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : తెలంగాణా స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డ్స్ ఫంక్షన్ సోమవారం హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియం లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా నల్లగొండ జిల్లా ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచర్ల విజయ్ గౌడ్ కు అవార్డు, నగదుకు పునస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ 2024 ఆగస్టు 19 న నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉత్తమ వార్త చిత్రాలకు గాను (బెస్ట్ న్యూస్ పిక్చర్)అవార్డు దక్కిందని ఈ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడంతో చాలా ఆనందంగా ఉన్నదన్నారు.
గతంలోనూ పలు ఉత్తమ అవార్డులు అందుకొని అందరి ప్రశంసలు పొందడం జరిగిందన్నారు. ప్రజ సమస్యలను ఎత్తిచూపుతు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఉద్యమ కాలం లో చాలా ఉత్తమ చిత్రాలు తనకు గుర్తింపుని తెచ్చాయని ఈ అవార్డ్ రావడం మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు.ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు అభినందించారు.