Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

police alert : పోలీసుల అలర్ట్, సోషల్‌ మీడియా లో ఇంటి చిరునామా వాడొద్దు

police alert : ప్రజా దీవెన, హైదరాబాద్‌: సోషల్‌ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నేరగా ళ్లు దీన్ని కూడా తమకు ఒక అవ కాశంగా మలచుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చాలా మంది తమకు సం బంధించి ఎప్పటికప్పుడు అప్‌ డేట్స్‌ను పోస్ట్‌ చేస్తుంటారు. తమ స్టేట్‌సతోపాటు తాము ఏం చేస్తు న్నదీ, ఎక్కడికి వెళ్తున్నదీ వంటివి మెసేజ్‌లు పెడుతుంటారు. ఇలాం టి వాటిని నేరగాళ్లు తమకు అను కూలంగా మలచుకునే అవకాశం ఉందని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు.

 

సోషల్‌ మీడియా లో వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలంటున్నారు. వ్యూస్‌ (వీక్షణలు), లైక్స్‌ కోసం దినచర్యను పోస్ట్‌ చేయవద్దని, ముఖ్యంగా ఊరెళ్తున్నామంటూ పోస్ట్‌లు చేయడం యమ డేంజర్‌ అంటూ ‘ఎక్స్‌’ ద్వారా పోలీసులు సూచిస్తున్నారు. యూట్యూబ్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌ లలో వ్యూస్‌ కోసం హోంటూర్స్‌ (ఇంటిని చూపించడం) చేయవద్దని, సోషల్‌ మీడియాలో ఇంటి చిరునామాను బహిర్గతం చేయవద్దని పోలీసులు పేర్కొం టున్నారు.