Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PoliceBharosa: బాధిత  మహిళలకు భరోసా 

బాధిత  మహిళలకు భరోసా 

–సెంటర్ వార్షికోత్సవం సందర్బంగా బాధితులకు సాయం

PoliceBharosa: ప్రజా దీవెన, రామగుండం: రామగుండం పోలీస్ కమీషనరేట్ మం చిర్యాల జోన్ లో భరోసా సెంటర్ వార్షికో త్సవం ఘనంగా నిర్వహిం చారు. బాధిత మహిళలు లేదా బాలిక లకు వైద్యం, కౌన్సిలింగ్, అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికి పోలీస్ అండగా ఉందనే మనోదైర్యం కల్పించడం కోసం ఏర్పా టు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సరకాలం సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మంచిర్యాల డిసిపి భాస్కర్ హాజరై భరోసా సిబ్బంది తో కలసి కేక్ కట్ చేసి అనంతరం బాధితుల తో మాట్లాడి భరోసా కల్పించి వారికి సహాయం చేయడం జరిగింది.

ఈ సందర్బంగా డిసిపి మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. భరో సా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలి పారు. భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందిం చడానికి మరియు ఆపదకు లోనైన వారికి పోలీస్ స్టేషన్లకు, ఆసుప త్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించ డానికి ఏర్పాటు చేయబడ్డాయి.

హింస మరియు లైంగిక వేధింపు లకు గురైన పిల్లలు, స్త్రీలు మరల ఇటువంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా సెంటర్ యొ క్క ముఖ్య లక్ష్యం అన్నారు.లైంగిక వేధింపులకు గురైన బాధిత మహి ళల కు లేదా బాలికలకు సంబందించిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన సమయం నుండి బాధితులకు అండగా ఉం టూ వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ మరియు భరోసా సెంటర్ల గురించి అందరికీ అవ గాహన కల్పిస్తున్న భరోసా సెంటర్ సిబ్బందిని డిసిపి అభినందించారు.

ఈ కార్యక్రమం లో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్,  మంచిర్యాల రూరల్ సీఐ అశోక్,మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ , సీసీసీ నస్పూర్ ఎస్ఐ సుగునాకర్ మంచిర్యాల టౌన్ ఎస్ఐ వినీత ,మంచిర్యాల జిల్లా షి టీమ్ ఎస్ఐ హైమ,షి టీమ్ సిబ్బంది,భరోసా సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.