Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponguleti Srinivas Reddy: రైతు పక్షపాతిగా ఇందిరమ్మ రాజ్యం

— 31 వేల కోట్ల రూపాయల రుణ మాపీ చేశాం, చేస్తున్నాం
–ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దరణిని ప్రక్షాళన చేస్తున్నాం
–గత ప్రభుత్వం తీసుకున్న భూము లను స్వాధీనపర్చుకొని పేదలకే పం చుతాం
— ఖమ్మం జిల్లా పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన, ఖమ్మం: తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరు వా త పేదలు, రైతుల పక్షపాతిగా వ్యవ హరిస్తోందని రెవిన్యూ, సమాచార పూర్వ సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నా రు. 31 వేల కోట్ల రూపాయలు రుణమాపీ చేసింది, చేస్తుందన్నా రు.ధరణి వల్ల రైతులు చాలా ఇ బ్బందులు పడుతున్నారని, గతం లో గొప్పలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ నేతలు ధరణిపై అబద్ధాలు చెపుతు న్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) మండిపడ్డారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వల గూడెంలో ఆదివారం ఆయన పర్య టిస్తున్నారు. ఈ సందర్భగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్‌ను (Health Sub Centre) ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చి న మాట ప్రకారం దరణిని ప్రక్షాళన చేస్తున్నామని కష్టం చేశారు.విద్య వైద్యకు కాంగ్రెస్ ప్రభు త్వం పెద్ద పీట వేసిందని రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచి త వైద్యం చేపట్టిందని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తం గా అతి కొద్ది రోజుల్లో 4 లక్షల 50 వేల ఇళ్లు కట్టబోతున్నామని తెలి పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు పేదలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చా రని, గత ప్రభుత్వం తీసుకున్న భూములను పేదలకు పంచు తా మని స్పష్టం చేశారు. ఏడు నెలలు పూర్తి కాకుండానే ఏం చేయ లేదని ప్రతి పక్ష పార్టీ నాయకులు విమర్శి స్తున్నారని, గత ప్రభుత్వ పాలనలో నే ఆత్మహత్యలు జరిగాయని, కాం గ్రెస్ వచ్చింది కాబట్టే కరెంటు, నీళ్లు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆనం దంగా ఉన్నారని, మంచి పరిపాలన కావాలని ఇందిరమ్మ రాజ్యం తె చ్చుకున్నామని, ఆడ బిడ్డలు, రైత న్నల ముఖాల్లో ఆనందం చూడల న్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుకు వేగంగా అడుగులు.. ఇదిలా ఉంటే లేఅ వుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆ ర్‌ఎస్‌) అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నా యి. గత నాలుగేళ్లుగా లక్షల సం ఖ్యలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు లకు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడు నెలల్లో మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెం డింగ్‌ దరఖాస్తుల సమస్య పరిష్కా రంపై ఇరవై రోజుల వ్యవధిలోనే అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష చేయడం, తాజాగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడాన్ని బట్టి ఈ అంశానికి ప్రభుత్వం ఎంత ప్రాధా న్యం ఇస్తుందన్నది స్పష్టం చేస్తోంది. మూడు నెలల్లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా క్షేత్ర స్థాయి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. కాగా ఈ ప్రక్రి య పూర్తయితే ప్రభుత్వానికి తక్ష ణం ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సుమారు రూ.10 వేల కోట్ల దాకా ఖజానాకు జమ అవుతాయ ని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో మునిసిపల్‌ శాఖ (Municipal Deptt)ఉన్న తాధికారులతో నిర్వహించిన సమీ క్షలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీ లనకు ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లేవని స్పష్టమైంది. సుప్రీంకో ర్టు, హైకోర్టు నుంచి ఈ ప్రక్రియపై ఎలాంటి స్టేలు లేవని వెల్లడైంది. దీంతో ఈ అంశంపై కింది స్థాయి అధికారులు, మునిసిపల్‌ కమి షనర్లు, జిల్లా పంచాయతీ అధికా రులు, ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రభు త్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించింది. అదే సందర్భంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించిన ట్లయిoది. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కో సం నాటి ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు రెం డు నెలలపాటు దరఖాస్తులను స్వీకరించింది.

ఈ మేరకు రాష్ట్రం లోని అన్ని పంచాయతీలు, ముని సిపాలిటీలు, కార్పొరేషన్ల (Panchayats, Municipalities, Corporations) నుంచి దాదాపు 25.70 లక్షల మంది దర ఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షల దరఖాస్తులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసి పాలిటీల నుంచి 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల నుంచి 6 లక్ష ల దరఖాస్తులు, అర్బన్‌ డెవల్‌ప మెంట్‌ అథారిటీల నుంచి 1.35 లక్ష ల దాకా దరఖాస్తులు అందాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 131 ప్రకారం ప్లాట్‌ యజమాని వ్యక్తి గతంగా దరఖాస్తు చేసుకుంటే రూ.1000 ఫీజు చెల్లించాలని, లేఅవుట్‌ డెవలపర్‌ దరఖాస్తు చేస్తే రూ.10 వేలు ఫీజుగా చెల్లించాలని నిర్ణయించిం ది. అయితే దీనిని సవా లు చేస్తూ జువ్వాడి సాగర్‌ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించా రు. కానీ, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు లపై హైకోర్టు నుంచి గానీ, సుప్రీం కోర్టు నుంచి గానీ ఎలాంటి మధ్యం తర ఉత్తర్వులు ప్రభుత్వానికి రాకపోవడంతో పురపాలక శాఖ 2023 మే 20న (లెటర్‌ నంబరు 14148/పీఎల్‌జీ.111/2020) ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించింది.

18 మందికి ఇళ్ల పట్టాలు అంద జేత ఖమ్మం మండలంలోని పోలే పల్లి లో చాలా ఏళ్ళ క్రితం డబల్ బెడ్రూం గృహాలు పొందిన పేదలకు ఇంతవరకు పట్టాలు దక్కకపోవడం తో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మా ణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో వాటిని మంజూరు చేయించారు. ఈ క్రమంలో ఆది వారం తన క్యాంపు కార్యాలయం లో మంత్రి పొంగులేటి 18 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారంతా మంత్రికి కృతజ్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు.