— స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్
Collector Raj Kumar: ప్రజాదీవెన, నల్గొండ: ప్రభుత్వ సర్వీస్ లో పదవి ముఖ్యం కాదని, అందించిన సేవలే ముఖ్యమని స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్ అన్నారు.
సమాచార శాఖలో 32 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించి బుధవారం నల్గొండ జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో పదవి విరమణ చేసిన ఆఫీస్ సభార్డినేట్ కొండమ్మ పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొండమ్మ ఆఫీస్ సబార్డినెట్ అయినప్పటికీ ఆమె అందించిన సేవలు మరువలేనివని, ముఖ్యంగా నిత్యం పనులతో బిజిగా ఉండే సమాచార శాఖలో సమర్థవంతంగా పనిచేసే అధికారుల మన్ననలను పొంది పదవి విరమణ పొందడం సంతోషకరమైన విషయం అని అన్నారు. పదవి విరమణ తర్వాత ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా సమాచార శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సిహెచ్. శ్రీనివాస్, రికార్డ్ అసిస్టెంట్ యాదన్న తదితరులు మాట్లాడారు. ఈ పదవి విరమణ కార్యక్రమానికి కార్యాలయ సిబ్బంది సహదేవ్, రేణుక, పర్వీన్ తోపాటు, ఆనంద్ తదితరులు హాజరై పదవి విరమణ పొందిన కొండమ్మను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.