అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు.
ప్రజా దీవెన,కోదాడ:ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని పలువురు వైశ్య సంఘ నాయకులు పేర్కొన్నారు ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ ఆర్యవైశ్య సంఘం, అవోపా, వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ప్రధాన రహదారిపై గల పాత ఎంపీడీవో ఆఫీస్, ప్రధాన రహదారులపై గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టుదలతో సాధించలేనిది ఏమీ లేదని పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తృణప్రాయంగా తన ప్రాణాలను అర్పించిన మహనీయుడిని అన్నారు ఆశయాన్ని సాధించేందుకు పట్టుదలగా కృషి చేస్తే సాధించవచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి అన్నారు నేటి యువత పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడుస్తూ సమాజ హితం కోసం తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పొట్టి శ్రీరాములు వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించేందుకు నిర్ణయించడం హర్షనీయమన్నారు.
ఈ సందర్భంగా సంఘాల తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పైడిమర్రి నారాయణరావు గరిణే శ్రీధర్ తెల్లాకుల వెంకటేశ్వర్లు పైడిమర్రి వెంకటనారాయణ రాయపూడి వెంకటనారాయణ ఇరుకుళ్ళ చెన్నకేశవరావు పందిరి సత్యనారాయణ యాద సుధాకర్ వంగవీటి గురునాథం గాదంశెట్టి శ్రీనివాసరావు గరిడేపల్లి లక్ష్మణరావు ఇమ్మడి అనంత చక్రవర్తి బెలిదే భరత్ కుమార్ వంగవీటి భరత్ చంద్ర నాగ అఖిల్ ఓరుగంటి పాండు నీలా సత్యనారాయణ పైడిమర్రి సతీష్ కుమార్ వెంపటి ప్రసాద్ మేళ్లచెరువు కిషోర్ తదితరులు పాల్గొన్నారు