Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Praja Vani Applications : ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Praja Vani Applications  :ప్రజాదీవెన నల్గొండ : ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సోమవారం కేవలం 15 మంది ఫిర్యాదుదారులు మాత్రమే ఫిర్యాదులను సమర్పించగా, ఆ ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదును పంపిస్తూ సాధ్యమైనంత త్వరగా ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా ఫిర్యాదుదారుకు పరిష్కారాన్ని తెలియజేయాలని, ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కాకపోతే ఎందుకోసం కాలేదో ఆ వివరాలను సైతం తెలియజేయాలని, అలాగే కలెక్టర్ కార్యాలయంలోని ఫిర్యాదుల విభాగానికి సైతం వెంటనే ఫిర్యాదు పరిష్కారం పై తెలియజేయాలని చెప్పారు. మండల, గ్రామస్థాయిలో సైతం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఆమె ఆదేశించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, తదితరులు ఫిర్యాదులను స్వీకరించారు.