PRTU TGS: ప్రజా దీవెన ,కోదాడ: బుధవారం హైదరాబాదులో జరిగిన ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డు టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(పిఆర్టియు టీజీఎస్) (PRTU TGS)35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో (State Council meeting) కోదాడ పట్టణానికి చెందిన మాతంగి ప్రభాకర్ రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజూర్ నగర్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు.పిఆర్టియు టిజిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా2024-2026 విద్య సంవత్సరానికి ఎన్నికైన సందర్భంగా హైదరాబాదులో ప్రమాణ స్వీకారం (Oath taking)చేసినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన పిఆర్టియు టిజిఎస్ (PRTU TGS) సంఘం మండల జిల్లా రాష్ట్ర సీనియర్,మాజీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.సంఘ బలోపేతానికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు. ప్రభాకర్ రావుకు తోటి ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ,బంధువులు ,స్నేహితులు. అభినందనలు తెలిపారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.