ప్రజా దీవెన, కోదాడ: రాష్ట్రంలోని అధికారపార్టీ చేస్తున్నఅరాచకాలను ప్రశ్నించినందుకు BRS పార్టీ రాష్ట్ర నాయకులను అక్రమ అరెస్టులు చేయడం అధికార దుర్వినియోగము చేయటం కాంగ్రెస్ పార్టీ దివాళ కోరుతనానికి నిదర్శనమని టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్ కే నహీం అన్నారు, శుక్రవారం పట్టణంలోని స్థానిక నిమ్మకాయల సెంటర్లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అరెస్టులకు నిరసనగా నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం నహీం మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించినందుకే అక్రమంగా అరెస్టు చేసి అధికారాన్ని దుర్వినియోగం పాల్పడుతున్నారని తెలిపారు .
ఎన్నికలలో అమలు కాని హామీలను ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నమ్మి గెలిపించిన ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కోదాడ పట్టణ పోలీసులు నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు BRS పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, పార్టీ మహిళా నాయకురాలు పిట్టల భాగ్యమ్మ, పార్టీ నాయకులు కర్ల సుందర్ బాబు, చలిగంటి వెంకట్, జానీఆర్ట్స్, గొర్రె రాజేష్, కె.లక్ష్మణ్, షేక్ దస్తగిరి తదితరులు అరెస్టయినా వారిలో ఉన్నారు.