Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Raghu : పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ విజయవంతం.

*అందరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం.రఘు

Raghu : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి టాలెంట్ టెస్ట్ విజయవంతం చేసిన యూనియన్ సభ్యులకు, వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్నవిద్యార్థులకు యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు పడిశాల రఘు శుక్రవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

 

టాలెంట్ టెస్ట్ కు ఐదు మండలాల నుండి సుమారు వందమంది పైగా విద్యార్థులు హాజరు కావడం పట్ల యూనియన్ పక్షాన ఆనందోత్సవాలు వ్యక్తం చేసారు. టెస్ట్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా హాజరైన టిపిసిసి డెలికేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారింగుల అంజన్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుదీర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో యూనియన్ పక్షాన మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.