–రాష్ట్ర బిజెపి రథసారధి ఎంపికపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
–దేశం, ధర్మం పట్ల అవగాహన ఉ న్న వ్యక్తిని నియమించాలన్న రాజా సింగ్
–కమలం పార్టీలో రాజాసింగ్ వ్యాఖ్యలతో కలకలం
Raja Singh: ప్రజా దీవెన, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)కామెంట్స్ కాకరేపుతున్నాయి. అధ్యక్ష పదవి విషయంలో ప్రజాసం తాజాగా చేసిన కీలక వ్యాఖ్యలతో కలకలం చెలరేగింది. లోక్ సభ ఎన్ని కలు (Lok Sabha Elections)ముగిసి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్గా ఉన్న కిషన్రెడ్డికి (To Kishan Reddy) కేంద్ర క్యాబినెట్ మంత్రిగా అవకాశం తిరిగి దక్కడం తో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది ఎంపీల్లో ఇద్దరిని కేంద్ర క్యాబినెట్ (Central Cabinet)లోకి తీసుకున్నారు. మిగిలిన ఆరు గురు ఎంపీల్లో నలుగురు పేర్లు ఈ రేసులో వినవస్తుండగా ముఖ్య మంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటలకు (ETALA RAJENDRA) బీజేపీ తెలంగాణ శాఖ బాధ్య తలు అప్పగిస్తారంటూ గడిచిన కొద్ది రోజులుగా ఊహాగానాలు వెలువ డుతున్నాయి.
లోక్సభ ఎన్ని కల్లో తెలంగాణలోని సగం పార్లమెంట్ స్థానాలను గెలిచి ఊపుమీదున్న బీజేపీ (BJP) రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని (Kishan Reddy) కేంద్ర మంత్రివర్గంలోకి తీసు కోవడంతో ఆయన స్థానంలో వేరొక ర్ని నియమించేందుకు రంగం సిద్ధమవుతుంది. కొత్తవ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్న క్రమంలో ఫైర్ బ్రాండ్ గోషామహల్ బీజేపీ ఎమ్మె ల్యే రాజాసింగ్ (Raja Singh) చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని కొత్త అధ్యక్షుడిగా నియమిం చాలని రాజాసింగ్ కోరడమే కాకుం డా పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడి ఎంపి క జరగాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే ల అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఓ వీడి యోను విడుదల చేయడం గమ నార్హం.తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోందని వచ్చే ఎన్నికల్లో అధి కారంలోకి రావడం ఖాయమని ఆ యన ఆశాభావం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజెందర్కు (Etala Rajender) పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోన్న వేళ రాజాసింగ్ వీడియో కలకలం రేపుతోంది. బిఆ ర్ఎస్ నుంచి 2003లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈటల రాజేందర్ సుదీర్ఘకాలం ఆ పార్టీలో ఉన్నారు. తెలంగాణకు తొలి ఆర్ధిక మంత్రిగా, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిం చారు. వామపక్ష భావజాలం కలిగిన ఈటల మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో విబేధాల కార ణంగా టీఆర్ఎస్కు 2021లో రాజీ నామా చేశారు. తన రాజకీయ భవి ష్యత్తు కోసం ఆయన బీజేపీలో చేరారు.వామపక్ష భావజాలం కలిగిన ఈటలను అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేయడం పరోక్షంగా ఈటల అభ్యర్థిత్వాన్ని ఆయన వ్య తిరేకిస్తున్నారనే చర్చ మొదలైంది. ఒకవేళ, ఎంపీగా గెలిచిన వ్యక్తిని పార్టీ చీఫ్గా నియమించాలను కుం టే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ఇవ్వాలనేది రాజాసింగ్ ఆంతర్యమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతునన్నాయి. హిందూత్వ భావజాలం కలిగిన అర్వింద్ 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అర్వింద్కు రాజా సింగ్ మద్దతు ఇస్తున్నట్లు సమాచా రం. రాజాసింగ్ వీడియోపై ప్రస్తుతం బీజేపీలో చర్చ జరుగుతోంది. బీజే పీ అధిష్ఠానం తెలంగాణ కొత్త అధ్య క్షుడి విషయంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ వాతావరణం ప్రస్తుతం బిజెపి క్యాడర్ (BJP cadre) లో నెలకొంది.