Rajagopal: ప్రజా దీవెన,కోదాడ : సామాజిక సేవా కార్యక్రమాలలో ఆర్యవైశ్యుల (Arya Vaishyas)పాత్ర కీలకంగా ఉంటుందని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ (Rajagopal) పేర్కొన్నారు కోదాడ అవోపా 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక గుడు గుండ్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు వైశ్యులు ఎల్లప్పుడూ సామాజిక సేవా దృక్పథాన్ని కలిగి ఉంటారన్నారు పరుల హితం కోసం ఇతరులకు పలు రకాల సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు కోదాడలో రెండు దశాబ్దాలుగా అవోపా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు ఆర్యవైశ్య మహిళలు సేవా రంగం తో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించాలన్నారు మహిళా రిజర్వేషన్లు ఏర్పడి ఉన్నాయి కాబట్టి పురుషులతో సమానంగా రాణించేందుకు సిద్ధం కావాలన్నారు.
అవోపా అధ్యక్షుడు (President of Aopa)ఇమ్మడి రమేష్ మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలను తమ సంస్థ తరఫున అవసరమైన ప్రజలకు అందిస్తున్నామన్నారు విద్యానిధి ద్వారా ప్రతి సంవత్సరము ఎంపిక చేసిన విద్యార్థులకు ఆర్థికచేయుతను అందిస్తున్నామన్నారు అదేవిధంగా తమ సంస్థ నుండి వృద్ధులకు పెన్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం 48 మంది విద్యార్థులకు విద్యా నిధి నుండి సహకారం అందించడమే కాక పలు కోర్సులలో ఆధిక్యత కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా అవార్డులను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. పదిమంది వృద్ధులకు పెన్షన్లను అందజేశామన్నారు అవసరంలో ఉన్న ఆర్యవైశ్యులను ఆదుకోవడమే తమ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అనంతరం 2024- 26 సంవత్సరానికి ఎన్నిక కాబడిన నూతన కార్యవర్గం ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు (President of the state) వందనపు శిల్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నకేశవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కందిబండ వెంకటేశ్వరరావు, వంగవీటి లోకేష్ బొగ్గరపు రామ్మూర్తి చారుగుండ్ల రాజశేఖర్, ఓరుగంటి శ్రీనివాసరావు, స్వామి శ్రీనివాసరావు, గరిణే కోటేశ్వరరావు, ఓరుగంటి ప్రభాకర్ , గరినే శ్రీధర్ వంగవీటి శ్రీనివాసరావు ,పెనుగొండ శ్రీనివాసరావు, పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు వాసవి క్లబ్ బాధ్యులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు