Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rajya Sabha member Ravichandra : దీక్షాదక్షలతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి

— రాజ్యసభ సభ్యు లు వద్దిరాజు రవిచంద్ర

Rajya Sabha member Ravichandra :ప్రజా దీవెన, హైదరాబాద్: విద్యార్థులు,యువత ఒక నిర్దిష్ట మైన లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశి క్షణ, పట్టుదల,దీక్షాదక్షలతో ముం దుకు సాగుతూ జీవితంలో ఉన్న తంగా ఎదగాలని రాజ్యసభ సభ్యు లు వద్దిరాజు రవిచంద్ర ఉద్బోధిం చారు.ది తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (రూరల్- టీటీడీ సీఏ)వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మాజీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి ఏర్పా టు చేసిన క్రికెట్ పోటీలను ఎంపీ రవిచంద్ర ప్రారంభించారు. తెలంగా ణ జిల్లాలకు చెందిన గ్రామీణ- అ మెరికన్ యూత్ క్రికెట్ అకాడ మీ (ఏయూసీఏ)జట్లకు మధ్య జరిగే ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎంపీ వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజర య్యారు.శంషాబాద్ విమానాశ్ర యానికి చేరువలో తొండుపల్లి వద్ద ఎంపీస్ క్రికెట్ మైదానంలో సోమవా రం నుంచి ఈనెల 31వతేదీ వరకు జరిగే ఈ టోర్నమెంటులో అండర్ -17 జట్లు పాల్గొంటున్నాయి.

 

 

ఎంపీ రవిచంద్ర టాస్ వేసి, బ్యాటింగ్ చేసి ఈ పోటీలను ప్రారంభించి క్రికెటర్ల ను ఉద్దేశించి మాట్లాడుతూఈ ఆటకు మన దేశంలో రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతున్నద న్నారు.ఇటీవల దుబాయ్ లో జరి గిన వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ పో టీలను సుమారు 100 కోట్ల మం దికిపైగా టీవీలకు అతుక్కుపోయి చూశారన్నారు. విద్యార్థులు చదు వుతో పాటు క్రీడల్లో కూడా రాణిం చాలని,ఇందులో కూడా మంచి భవిష్యత్తు ఉందన్నారు.తాను చదువుకునే రోజుల్లో క్రికెట్, వాలీ బాల్ ఆడేవాడినని,ఆటల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మాన సిక ఉల్లాసం పొందవచ్చని, ఆరోగ్య వంతులుగా జీవించవచ్చని చెప్పా రు.క్రికెట్ దిగ్గజాలైన కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లను ఆదర్శంగా తీసుకుని అకుం ఠిత దీక్షతో గొప్ప క్రీడాకారులుగా ఎదిగాల్సిందిగా ఎంపీ వద్దిరాజు క్రికెటర్లను ఆశీర్వదించారు.

ఈ టోర్నమెంట్ నిర్వాహకులు, స్పో ర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ వెంక టేశ్వర రెడ్డి అభిమానినని,గత కొన్నేళ్లుగా క్రీడాకారులను వెన్నుత ట్టి ప్రోత్సహిస్తున్నారని అభినందిం చారు.ఈ కార్యక్రమంలో ఎంపీ రవి చంద్ర సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్, అమెరికా యూత్ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ అరుణ్ కొలిపాక,మతీన్, రాఘ వరెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొ న్నారు.

వద్దిరాజుకు ఘనస్వాగతం

పోటీలను ప్రారంభించేందుకు విచ్చే సిన ఎంపీ వద్దిరాజు,ఆయన సన్ని హితులు మరికల్ పోత సుధీర్ కు మార్ తదితరులకు ఒగ్గుడోలు కళా కారులు ఘన స్వాగతం పలికారు. టీటీడీసీఏ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి ఎంపీ రవిచంద్ర, సుధీర్ కు మార్ తదితర ప్రముఖులకు పుష్ప గుచ్ఛాలిచ్చి శాలువాలతో సత్కరిం చారు.ఈ టోర్నమెంట్ ప్రారంభోత్స వం సందర్భంగా అండర్ -17 క్రికెట ర్లతో ఎంపీ రవిచంద్ర కరచాలనం చే స్తూ అభినందనలు తెలి పారు. ఈ టోర్నమెంట్ సందర్భంగా భార త్, అమెరికా దేశాల జాతీయ గీతా లను ఆలపించారు.