Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ram Gopal Varma : నేను దివాలా తీశాను నా దగ్గర డబ్బులు లేవు.ఫైబర్‌నెట్‌కు ఆర్జీవీ లేఖ.

Ram Gopal Varma : ప్రజా దీవెన, హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మపై కేసులు పెట్టి అరెస్టు చేయించేందుకు ఫైబర్ నెట్ రెడీ అవుతోంది. వ్యూహం సినిమా పేరుతో ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన ఆయన కు గతంలో ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. కోటిన్నర వరకూ కొట్టేశారని.. మర్యాదగా వాటిని వెనక్కి ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఫైబర్ నెట్ పేర్కొంది. పదిహేను రోజుల సమయం పచ్చింది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం.. తాను దివాలా తీశానని తన దగ్గర డబ్బుల్లేవని ఆయన సమాచారం పంపారు. దొంగతనం చేసిన డబ్బులు ఖర్చు అయిపోయానని అంటే ఊరుకుంటారా .. అన్న చిన్న లాజిక్ ను ఆర్జీవీ మిస్సయ్యారు. అనేది నెటిజన్ల ప్రశ్న..

ఆర్జీవీని వదిలే ప్రశ్నే లేదని ఆయన దగ్గర డబ్బులు లేవంటే.. చట్ట పరంగా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. గతంలో ఫైబర్ నెట్ లో జరిగిన అవకవకతలను వెలికి తీస్తున్నారు. ఈ అంశంలో చంద్రబాబుపై పెట్టిన కేసులో ఎన్ని తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేశారో కూడా ఆయన బయటకు తీస్తున్నారు. అసలు ఫిర్యాదు గౌతం రెడ్డి చేస్తే.. మధుసూదన్ రెడ్డి చేసినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడి నుంచి అన్నీ తప్పుల తడకలే. టెరాసాఫ్ట్ అనే సంస్థ లీగల్ నోటీసులు కూడా ఇచ్చిందని జీవీ రెడ్డి చెబుతున్నారు.

 

ఆర్జీవీని నాలుగో తేదీన రావాల్సిందిగా ప్రకాశం జిల్లా పోలీసులు సోషల్ మీడియాకేసుల్లో పిలిచారు. హాజుర కాకపోతే ఆ కేసుల్లో బెయిల్ రద్దు పిటిషన్ వేస్తారు. ఫైబర్ నెట్ డబ్బులు కొట్టేసిన కేసుల్లో ఆయనపై కేసులు నమోదు చేసి.. ఎప్పుడైనా అరెస్టు చేయడానికి పోలీసులకు అధికారం ఉంది. ఆయన ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇంకా అప్లయ్ చేసుకోలేదు. కేసు నమోదైన సమాచారం లేదు కాబట్టి కోర్టులకు వెళ్లలేకపోతున్నారు. ఏపీ పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడే ఆయనను ఆ కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం ఉంది.