Ramgopal Verma : ప్రజా దీవెన, ముంబై: చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముంబైలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శ్రీ అనే సంస్థ ఈ చెక్ బౌన్స్ కేసును ఏడేండ్ల క్రితం దాఖలు చేసింది. కేసు విచారణకు రాంగోపాల్ వర్మ హాజరు కాకపోవ డంతో గతంలో కోర్టు నాన్ బెయిల బుల్ వారెంట్ జారీ చేసింది.
ఏడేం డ్ల నుంచి ఒక్క సారి కూడా ఆర్జీవీ కోర్టుకు రాకపోవడంతో ఆగ్ర హిం చిన కోర్టు నెగేషియెబుల్ ఇన్ స్ట్రుమెంట్ యాక్ట్ లోని సెక్షన్ 138 ప్రకారం శిక్షను ఖరారు చేసింది. పరిహారం కింద ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లేని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష అను భవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.