Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rammurthy: విద్యార్థులు పుట్టినరోజున ఒక మొక్కను నాటి సంరక్షించాల: రామ్మూర్తి

Rammurthy:ప్రజా దీవెన, కోదాడ: పాఠశాలలలో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థి తమ,తమ పుట్టినరోజున ఒక మొక్కను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని తేజా పాఠశాల ఇంచార్జ్ రామ్మూర్తి (Teja School Incharge Rammurthy) విద్యార్థులకు పిలుపునిచ్చారు శనివారం తేజ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ప్రణీత పుట్టినరోజు సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి రామ్మూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి సంరక్షించినట్లయితే అవి పెరిగి పెద్దవై మనకు నీడనిచ్చి ఎండ నుంచి కాపాడతాయని తెలిపారు. అలాగే మొక్కలు పెద్దవై మనము తినేందుకు పండ్లను ఇస్తాయని తెలిపారు పెరిగి పెద్దవయినంక పాఠశాల ఆవరణం అంతా పచ్చదనంగా ఉంటుందని అందువలన మనం జీవించేందుకు స్వచ్ఛమైన ఆక్సిజన్ (Oxygen) అందిస్తాయని తెలిపారు మొక్కలు మానవ మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు గతంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు నాటిన మొక్కలు పెరిగి పెద్దవై నేరేడు పండ్లు మామిడి పండ్లు ఇస్తున్నాయని గుర్తు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి మొక్కను నాటి సంరక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రెటరీసంతోష్ కుమార్, సోమ నాయక్, నవ్య, రమేష్, పిఈటి రాంబాబు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు

స్థానిక తేజ టాలెంట్ స్కూల్ (Teja Talent School) విద్యార్థులు పాఠశాలలో, ఎవరి పుట్టినరోజు అయిన, ఆరోజు పాఠశాలలో మొక్కను నాటుతున్నారు. పాఠశాలలో చదివిన చాలామంది విద్యార్థులు ఇలా పళ్ళ మొక్కలను, నీడనిచ్చే మొక్కలను నాటారు. పాఠశాలలో నాటిన నేరేడు పళ్ళ మొక్క నేడు నేరేడు పళ్ళను, మామిడి చెట్టు మామిడి కాయలను కాసింది. ఇలా పిల్లలు గతంలో వేసిన మొక్కలు ఫలాలను ఇస్తుండడంతో ఇతర పిల్లలు స్ఫూర్తిని పొంది, నేడు వారి పుట్టినరోజున పూల మొక్కలను, పళ్ళ మొక్కలను (Flowering plants and deciduous plants) నాటుతున్నారు.నేడు పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని ఎస్. ప్రణీత పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుల సమక్షంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో ఇన్చార్జి రామ్మూర్తి ,సెక్రెటరీ సంతోష్ కుమార్, సోమనాయక్,నవ్య, వాహబ్,రమేష్, పిఈటి రాంబాబు ఇతర ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.