Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ramulamma: గర్భిణీలు ఆహారం,ఆరోగ్యం పట్ల శ్రద్ద పాటించాలి

Ramulamma: ప్రజా దీవెన, శాలిగౌరారం: గర్భిణీలు ఆహారం, ఆరోగ్యం (Pregnant women diet and health)పట్ల శ్రద్ద పెట్టి నెలా నెలా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పబ్లిక్ హెల్త్ నర్స్ రాములమ్మ (Ramulamma)అన్నారు.శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 11వ వారం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణీ పుష్టికరమైన ఆహారం తీసుకోవాలన్నారు. చైత్ర ఫౌండేషన్ (Chaitra Foundation)వారు స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమం లో పౌష్టికాహర దాతలు చైత్ర ఫౌండేషన్ ఛైర్మెన్ యంగళి రామకృష్ణ గౌడ్ -జ్యోతి దంపతులు,అయ్యుష్ మెడికల్ ఆఫీసర్ వాసవి,సూపర్ వైజర్లు దయామణి,మరియా,ఎం ఎల్ హెచ్ పి శ్వేత,లయన్ క్లబ్ ప్రతినిధులు దునక వెంకన్న,రామడుగు వెంకట్రామ శర్మ, దామెర్ల శ్రీనివాస్,ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు వివిధ గ్రామాల గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.