rape : ప్రజా దీవెన, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభు త్వ ఉపాధ్యాయులు ఆంబోతులా మారి అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపి సభ్య సమాజంలో ఉపా ధ్యాయ వృత్తినే తలదించు కునే విధంగా వ్యవహరించాడు. సదరు ఉపాధ్యాయ ప్రబుద్ధుడు తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె కూతు ళ్లపై కూడా అత్యాచారానికి ఒడిగ ట్టాడు. ఏదైతేనేం ఎట్టకేలకు ఉపా ధ్యాయుడికి హెచ్ఐవీ సోకడంతో తమపై జరుగుతున్న అకృత్యాల ను తల్లి దృష్టికి తీసుకొచ్చారు సద రు యువతులు.
వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెంది న జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తు న్నాడు. సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా తల్లితో పాటే ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయు డు తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు.
తల్లితో చెబితే చంపేస్తానని బెది రించి, బాలికలపై పదేపదే అత్యా చారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ ప్రబుద్ధుడు వైద్య పరీక్షలు చేయిం చుకోగా హెచ్ఐవీ సోకినట్లు తేలిం ది. ఈ విషయం తెలిసి బాలికలు ఆందోళన చెంది తల్లికి విషయం చె ప్పారు. దీంతో తల్లి కూతుళ్లు పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.