Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ravinder : లక్షడప్పులు వేలగొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Ravinder : ప్రజా దీవెన,సంస్థాన్ నారాయణపూర్ : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 7వ తేదీన తలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తాలో గోడపత్రికలను ఎమ్మార్పీఎస్ నాయకులు, ఎంజెఎఫ్ నాయకులు ఆవిష్కరించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా మాదిగ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు జీడిమెట్ల రవీందర్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణ లక్ష్యసాధన కోసం జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి మాదిగ బిడ్డ గొంతెత్తి డప్పు మోగిస్తూ ముందు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో ఎంజెఎఫ్ మండల అధ్యక్షుడు చింతకింది సుధాకర్,ప్రధాన కార్యదర్శి సిరిపంగి బాలరాజు,ఎంజెఎఫ్ జిల్లా నాయకులు కలకొండ సంజీవ,ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ముత్యాల చంద్రకాంత్,వలిగొండ యాదయ్య,సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రేవనపల్లి బుగ్గ రాములు,వడ్డేపల్లి వంశీ,చెరుకుపల్లి కృష్ణ,జనగాం కిరణ్, తదితరులు పాల్గొన్నారు.