–బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీం ద్ర కుమార్
Ravindra Kumar : ప్రజా దీవెన, నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో దగా పడు తున్న రైతులకు అండగా నిలిచేందుకు తలపెడుతున్న రైతు దీక్షకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ కోరా రు. ఈనెల 21న జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ లో రైతు మహా ధర్నా నిర్వహించడం జరుగుతుం దని ఈ ధర్నాకు పార్టీలకు అతీతం గా హాజరై విజయవంతం చేయాల న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు చేసిన మోసాలపై ప్రభుత్వాన్ని నిల దీస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. శనివారం నల్లగొం డ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మాట్లాడారు. నల్లగొం డ జిల్లా పార్టీ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఎక రాకు 17.500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని, గ్రామా ల్లో కరెంట్ కోతలు ఉన్నాయని అన్నారు.
సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ ఉదయం వరకు త్రీ ఫేజ్ రావడం లేదు అని చెప్పారు. రైతులను యూరియా కొరత వేధిస్తుంది. రైతు సమస్యలపై బీ ఆర్ఎస్ చేస్తున్న మహా ధర్నాకు పార్టీ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి లు హాజరవుతున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతులు మహాధర్నాకు తరలిరావా లని పిలుపునిచ్చారు.సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగ య్య యాదవ్ మాట్లాడుతూ రైతు మహాధర్నాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.బీఆర్ఎస్ పా ర్టీ ఎల్లప్పుడూ పేదలు, ప్రజల పక్ష మేనని అన్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అన్ని మోసాలే చేస్తుందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ప్రభు త్వం మెడలు వంచడానికే బిఆరెస్ పోరాటం చేస్తుందని చెప్పారు. యాదాద్రి భువనగిరి పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కానీ వారు, రైతు భరోసా రాని రైతులు అందరూ తరలి రావాలని ఆయన పిలు పునిచ్చారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మోసాలను ప్రశ్నిస్తే భువ నగిరి పార్టీ కార్యాలయంపై దాడి చేశారన్నారు.
అధికారులు సైతం నిస్పక్ష పాతంగా పని చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశం లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగ య్య, భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కల్లు గీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, జిల్లా గ్రం థాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్ట మల్లికార్జున రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సింగల్ విండో చైర్మన్ ధోటి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసిలు తండు సైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి, నల్గొండ, కనగల్ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య.పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మారగోని గణేష్, కో ఆప్షన్ సభ్యులు కొండూరు సత్య నారాయణ, జమాల్ ఖాద్రి, నాయకులు మైనం శ్రీనివాస్, లోడంగి గోవర్దన్, రావుల శ్రీనివాస రెడ్డి, గాదె రాంరెడ్డి, సయ్యద్ జాఫర్,మెరుగు గోపి, తవిటి కృష్ణ, కందుల లక్ష్మయ్య, మెండు మణిపాల్ రెడ్డి, బోధనం వెంకట్ రెడ్డి, నారగోని నర్సింహా, కోట్ల జైపాల్ రెడ్డి, దొడ్డి రమేష్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.