మందేసి ఆరు ప్రమాదాలు చేశాడు
ఓ యువకుడు మద్యం తాగి అర్ధరాత్రి కారుతో బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్లోని ఐకియా నుంచి ప్రారంభించి వరుసగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కామినేని ఆసుపత్రి వరకు ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.
హైదరాబాద్ లో కారు బీభత్సం
గంటవ్యవధిలో అర్థరాత్రి హల్ చల్
ఒకరు మృతి, 11మందికి గాయాలు
ప్రజాదీవెన, హైదరాబాద్: ఓ యువకుడు మద్యం తాగి అర్ధరాత్రి కారుతో బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్లోని ఐకియా (IKEA) నుంచి ప్రారంభించి వరుసగా (Rayadurgam Police Station) రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కామినేని ఆసుపత్రి వరకు ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి.
రోడ్డుపై దూసుకెళ్తూ రాత్రి 12.30 నుంచి 1.30 గంటల మధ్య ఈ వరుస ప్రమాదాలు చేశాడు. రాయదుర్గం ఠాణా పరిధిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని నిజాంపేట ప్రగతినగర్కు చెందిన పాతర్ల క్రాంతికుమార్ యాదవ్ ఆదివారం రాత్రి ఫుల్గా మద్యం తాగాడు. ఆ మత్తులో కారులో బయలుదేరి ఐకియా రోటరీ వద్దకు చేరుకున్నాడు. తాగిన మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టగా ఆ కారు ధ్వంసమైంది. అందులోని ఒక మహిళకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఆ కారును ఢీకొట్టి అనంతరం అక్కడి నుంచి పారిపోతూ ఉండగా గచ్చిబౌలి బాబూఖాన్ లేన్ దగ్గర ఒక బైక్ను ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో ఒకరికి కాలు విరిగిపోగా, ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
పూటుగా మద్యం తాగి
నిందితుడు మరింత వేగంగా కారును నడుపుతూ పిస్తా హౌజ్ ఎదురుగా వెళ్తూ 20-25 ఏళ్ల యువకుడిని ఢీకొట్టాడు. అక్కడి నుంచి పరారీ అయ్యాడు. వెంటనే ఆ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కానీ అతని వివరాలు ఏవీ బయటకు రాలేదు. మత్తులోనే మరో మూడు ప్రమాదాలు : ఓ వ్యక్తి మరణించిన క్రాంతి తన వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఆ పారిపోతూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలోని కిమ్స్ ఆసుపత్రి దగ్గర మరో బైక్ను ఢీకొట్టి వెళ్లిపోయాడు.
ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా కారు ఆపకుండా అక్కడి నుంచి ఉడాయించాడు. ఇలా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇలా గుద్దుకుంటూ పోతూ వరుస ప్రమాదాలు చేస్తున్న క్రాంతిని కొందరు గమనించి వెంటాడి మల్కం చెరువు దగ్గర వాహనాన్ని అడ్డుకున్నారు.
ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. క్రాంతి పోలీసులు రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించి మద్యం పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో పోలీసులు అవాక్కు అయిపోయారు. ఏకంగా మీటరు రీడింగ్ 550 వచ్చి ఆశ్చర్య పోయారు. నిందితుడి పూర్తి వివరాలను సేకరించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తును ప్రారంభించారు.
Rayadurgam Police Station starting from Ikea