Reservation : ప్రజా దీవెన, హైదరాబాద్: ధనార్జనే ధ్యేయంగా పుట్టుకొచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీలలో బీసీ,ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యద ర్శి జాజుల లింగంగౌడ్ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనర్జనే ధ్యేయంగా పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పీడిస్తూ లక్షలకు లక్షల రూపాయలు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల దగ్గర వసూలు చేస్తున్నారని కనీస మౌలిక వస తులు కల్పించడంలో ప్రైవేట్ యూనివర్సిటీలు విఫలమయ్యా యని అన్నారు.కొన్ని యూనివ ర్సిటీలు ఏలాంటి అర్హతలు లేకుం డా అక్రమార్గంలో దొంగ పత్రాలు సృష్టించి అధికారులను మచ్చిక చేసుకొని, ముడుపులు ఇచ్చి NAAC,NBA అక్రీడియేషన్ పొంది విద్యార్ధుల దగ్గర లక్షలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నా రని వాటినీ గుర్తించి క్షుణంగా తనీ ఖిలు చేయాలనీ కోరారు.
ఈ కార్య క్రమంలో తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్య క్షుడు బూర శ్రీనివాస్, ఓయూ జెఏసి చైర్మన్ బండి నరేష్ మాల మహానాడు సంక్షేమ సంఘం అధ్య క్షులు చంద్రమోహన్ రాయ్ బీసీ విద్యార్థి సంఘం ఓయూ ఇన్చార్జి గోదా రవీందర్ తదితరులు పాల్గొ న్నారు.