–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : రేషన్ కార్డుల కై వచ్చిన దరఖాస్తుల పై వెంటనే విచారణ చేసి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చండూరు ఆర్డీవో శ్రీదేవికి సూచించారు. బుధవారం ఆమె చండూరు ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి కింద వచ్చిన దరఖాస్తులు, వాటి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేగాక దరఖాస్తులను పరిశీలించారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు భూభారతి దరఖాస్తులను కేటగిరి వారిగా విభజించుకొని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
డివిజన్ పరిధిలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పురోగతికి తగు సూచనలు చేశారు. రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తులన్నిటి పై తక్షణమే తగు విచారణ చేయించి పరిష్కారించాలన్నారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ ఆర్డిఓ తో మాట్లాడి తెలుసుకున్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.