–అసెంబ్లీలో చర్చకుసై, గ్యారంటీల మోసంపై చర్చిద్దామా
–సీఎం రేవంత్ రెడ్డి కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్
SixGuaranteescam : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామ ని చెబుతున్న ఆరు గ్యారెంటీ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి మోసానికి పాల్పడుతున్నాడని ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమె త్తారు. మీరన్నట్లే తప్పకుండా చర్చ లకు సిద్ధమని, అసెంబ్లీ సమావేశా లు పెట్టి ఆరు గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసం పై చర్చిద్దామా అని సీఎం రేవంత్ రెడ్డి కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలం గాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సవాల్ విసిరారు. చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే అని ఆరోపిం చారు. ముఖ్యమంత్రికి అబద్దాలు ఆడడం అలవాటైందని, 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేద ని అన్నారు.
మహిళలకు రూ.25 00, వృద్ధులు, వికలాంగులు, వితం తువులకు పెన్షన్లు పెంచాలని డి మాండ్ చేస్తూ ఇవాళ ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీకి ఆబిడ్స్ జీపీ వో నుంచి తెలంగాణ జాగృతి ఆ ధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గోదావరి అం శంపై అసెంబ్లీలో చర్చకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమం త్రి రేవంత్ విసిరిన సవాల్ పై స్పం దించారు. ‘కేసీఆర్ దమ్ము ఎంతో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది. తెలం గాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవం త్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యార న్నారు. సీఎం హుందాగా వ్యవహ రించాలన్నారు.కేసీఆర్ కలలో కూ డా తెలంగాణకు నష్టం చేయరని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క ల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాం గ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని కవి త పేర్కొన్నారు. ఎన్నికలకు ముం దు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీలపై సోనియా గాంధీ సంత కం పెట్టిన కార్డులను ఇంటింటికి పం చారని, సోనియాగాంధీ మొహం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధు లను, వికలాంగులు మోసం చేశార ని కవిత మండిపడ్డారు. అందుకే పె న్షన్ల మొత్తాన్ని పెంచేలా రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని సోనియా గాంధీని కోరుతూ వేలాది పోస్టుకా ర్డులు సోనియా గాంధీకి పంపుతు న్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి 18 నెలలు పూర్తయి నా ఇచ్చిన హామీలు అమలు చే యలేదని కవిత విమర్శించారు.