Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: అక్బరుద్దీన్ ఆరోపణలు అవాస్తవం

–అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్గాటన

Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ (Akbaruddin) ఆరోపణలు వాస్తవమని ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy)ఖండించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అక్బరుద్దీన్ (Akbaruddin) ఆరోప ణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియో గించారని అమిత్ షా, కిషన్ రెడ్డి (Amit Shah, Kishan Reddy) పై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్ అని ఎవ రు ఔనన్నా కాదన్నా మోదీ దేశానికి ప్రధానమంత్రి ఆయన రాష్ట్రాలన్నిం టికి పెద్దన్నలాంటి వారు అని పేర్కొన్నారు.

గుజరాత్, బీహార్ (Gujarat, Bihar)లా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆయనను కోరామని తెలిపారు. వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవ హరించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసామని గుర్తు చేశారు. ఈ మాటలు నేను ఎక్కడో చెవిలో చెప్పలేదని, ఆదిలా బాద్ సభలో అందరి ముందే చెప్పానని స్పష్టం చేశారు. రాజకీ య ప్రయోజనం కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీని పెద్ద న్నలా వ్యవహరించాలని చెప్పానని కుండబద్దలు కొట్టారు. ఓల్డ్ సిటీని (Old City)ఇస్తాంబుల్ చేస్తామని మేం మాటల తో కాలయపన చేయమని, అక్బరు ద్దీన్ కు నేను మాట ఇస్తునాన్నని, వచ్చే ఎన్నికల నాటికి మెట్రో రైల్ లో ఓల్డ్ సిటీలో తిరుగుతామని చెప్పా రు. మేం ఏం చెప్పామో అది చేసి తీరుతామని, కేంద్రం నిధులు ఇచ్చి నా ఇవ్వకపోయినా ఓల్డ్ సిటీ మెట్రో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.