–రెండు రోజుల్లో ముసాయిదా నివేదిక
–ఫిబ్రవరి 2న కేబినేట్ సబ్ కమిటీకి తుది నివేదిక
–దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సర్వే
–అధికారులు, ఉద్యోగులను అభి నందించిన సీఎం రేవంత్ రెడ్డి
CM RevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విజయ వంతంగా పూర్తయిన సమగ్ర కుల గణన పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్య మంత్రి అన్నారు. జాతీయ స్థాయి లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు.
బుధవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వ హించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవ రావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ విభాగాల ఉన్న తాధికారులు పాల్గొన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే విజయ వంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందిం చారు. ఈ కుల గణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉప యోగపడుతుం దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేప ట్టి తమ చిత్త శుద్ధిని చాటుకుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటేడ్ కమిషన్ కు ఈ గణాంకాలు ఉపయోగప డుతాయన్నారు.
సర్వే డేటా ఎంట్రీ పూర్త యిందని, ఒకటి రెండు రోజుల్లో ముసాయి దా నివేదికను సమర్పి స్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివ రించారు. ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీ కి తుది నివేది కను అందజేయాలని ముఖ్య మంత్రి ఆదేశించారు. నవంబర్ 6వ తేదీన రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే 2024) మొదలైంది. అన్ని జిల్లా ల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం అధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వే మహాయజ్ఞంలో ఎన్యుమరే టర్లు, సూపర్ వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులు పాలుపంచు కున్నారు.
రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించింది. ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించింది. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. కొన్ని చోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, కొన్ని ఇండ్లకు తాళాలు ఉండటం, కొన్ని కుటుంబాలు అందుబాటు లో లేకపోవటం తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు సర్వేలో పాలుపంచుకోలేదదని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.
రికార్డు వేగంతో కులగణన…అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే ఫిబ్రవరి 4వ తేదీన సీఎం నేతృత్వం లో భేటీ అయిన రాష్ట్ర మంత్రి వర్గం ఇంటింటి సర్వే ద్వారా కులగణన చేసేందుకు నిర్ణయం తీసు కుంది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సర్వే చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. సెప్టెంబర్ 12వ తేదీన ఇంటింటి సర్వే కులగణన చేపట్టేందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఆరుగు రు మంత్రులతో ఏర్పాటయిన సబ్ కమిటీ వివిధ దఫాలుగా సమావే శమైంది. అక్టోబర్ 9వ తేదీన మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి చర్చించారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన పేరిట సర్వే చేపట్టాలని, ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అక్టోబర్ 10వ తేదీన ప్రణాళిక విభాగం సర్వేకు సంబంధించిన పూర్తి విధి విధానాలతో జీవో నెం.18 జారీ చేసింది.