Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: ధరణి ఇక ‘భూమాత’..!

–యుద్ధ ప్రాతిపదికను కసరత్తు ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం
–నేడో, రేపో అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా
–తహసీల్దార్లతో పాటు ఆర్డీవోలకు, అడిషనల్ కలెక్టర్లకు బాధ్యతలు –ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ల స్థాయి లో రెవెన్యూ కోర్టులు
–జిల్లా స్థాయిలో రెవెన్యూ ట్రిబున ల్స్, ఆ తర్వాతే సివిల్ కోర్టుకు
— రద్దయిన వీఆర్వోల స్థానంలో విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పోస్టు
–ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున నియామకం

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: కెసిఆర్ ప్రభుత్వంలో (KCR Govt)దరువు మీద దరువే సిన ‘ ధరణి’ ఇకపై కనుమరుగు కానుంది. ధరణి సంపూర్ణంగా రద్దుకు రంగం సిద్ధo చేసింది రేవంత్ (Revanth Reddy)నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలతో సతమతం అవు తున్న రైతులకు అతి త్వరలోనే మోక్షం లభించనుంది. ధరణి వెబ్ పోర్టల్లో ఉన్న సాంకేతిక సమస్యల కు శాశ్వతంగా చరమగీతం పాడి సరికొత్త సాంకేతికతతో ప్రజలకు సులువైన మార్గాన్ని ప్రజల ముందు కు తీసుకొచ్చేందుకు దాదాపు అవసరమై న కసరత్తు పూర్తయిం ది. ధరణి స్థానంలో ‘భూమాత’ పేరుతో నూతన రెవెన్యూ వెబ్ పోర్టల్ను తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్య లు తీసుకుంటున్నది. ధరణి పేరు ను భూమాతగా మార్చడంతో పాటు ధరణి వెబ్ పోర్టల్లో ఉన్న లోపాలను పూర్తిగా సవరించి ఫార్మర్స్ ఫ్రెండ్లీ రెవెన్యూ వెబ్ పోర్ట ల్గా (Friendly revenue web portal)గా భూమాతను తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికా రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమ యంలో అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తు త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని బంగా ళాఖాతంలో కలిపేస్తా మని, ధరణికి ప్రత్యామ్నాయంగా భూ మాత వెబ్పోర్టల్తో పాటు కొత్త రెవె న్యూ చట్టం తీసుకువస్తామని పదేపదే చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారు. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం నిర్వహిస్తున్న తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ధరణి రద్దుతో పాటు కొత్తగా తీసుకురా బోతున్న ఆర్ఓఆర్ (రికార్డు ఆఫ్ రైట్) యాక్టు ముసాయిదాపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

సమస్యలకు చరమగీతం..

ప్రస్తుతం ధరణిలో (darani) ప్రతి చిన్న సమ స్య పరిష్కారం కోసం కూడా బాధితుల దరఖా స్తులు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లి రావాల్సిందే. కలెక్టర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆ దరఖా స్తుల పరిష్కారం రెండు అడుగులు ముందు కు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ధర ణిలో వివిధ భూ సమస్యలతో సుమారు 2.50 లక్షల పైచిలుకు దరఖాస్తులు కలెక్టర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. దీంతో కొత్తగా ప్రభుత్వం తీసుకురాబోతున్న భూమాత వెబ్ పోర్టల్లో (On Mother Earth web portals)రెవెన్యూ అధికారుల అధికా రాలను వికేంద్రీకరించి రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా తహసీల్దా O తో పాటు ఆర్డీవోలకు, ఆడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)కు కూడా రెవెన్యూ సమస్యల పరిష్కరించే అధికా రాలను అప్పగించనున్నారు.

రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ కు శ్రీకారం.. కేసీఆర్ (kcr)ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చి న ఆర్ఆర్ యాక్టు-2020లో రెవెన్యూ కోర్టుల ను రద్దు చేశారు. దీంతో 1971 ఆర ఆర్ యాక్టు ప్రకారం నిర్వహిస్తున్న తహసీ ల్దార్ కోర్టు, ఆర్డీవో కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రద్దు అ య్యాయి. గతంలో రద్దు చేసిన రెవె న్యూ కోర్టులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరు ద్దరించాలని నిర్ణయిం చింది. అయితే తహసీ ల్దార్ కోర్టులను మాత్రం పునరుద్ధరించ డం లేదని, కేవలం ఆర్డీవో, అడిష నల్ కలెక్టర్ కోర్టులను మాత్రమే పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే, జిల్లా కలెక్టర్ స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యున ల్సు ఏర్పాటు చేయనున్నా రు. వీటిలో జరిగే నిర్ణయాలపై అభ్యం తరాలున్నవారు మాత్రమే సివిల్ కోర్టుకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం అమ లులో ఉన్న ఆర్ఆర్ యాక్టు – 2020 ప్రకారం ప్రతి చిన్న భూ సమస్యకు కూడా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. అధికారులు చేసి న తప్పులకు కూడా రైతులే సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

నేడో రేపో అసెంబ్లీకి.. తెలంగాణలో భూ సమస్యలకు కొత్త రెవెన్యూ చట్టం (New Revenue Act)ఒక్కటే పరిష్కారమని సీఎం రేవంత్రెడ్డి మొదటినుంచి భావి స్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ఆర్ఆర్ యాక్టుకు సంబంధించిన ముసాయి దాను ప్రముఖ భూ చట్టాల నిపుణు లతో సిద్ధం చేయించారు. ఈ ముసా యిదాపై దాదాపుగా కసరత్తు పూర్తి అయినట్లు సమా చారం. ఈ ముసాయిదాను నేడో రేపో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అసెంబ్లీలో చర్చించడం తోపాటు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహిం చనున్నారు. అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత, ప్రజాభిప్రాయ సేకరణతో పాటు సూచనలు.. సలహాలను స్వీకరిం చిన తర్వాత ప్రజల అభీష్టం మేరకు నూతన రెవెన్యూ చట్టాన్ని అమలులోకి తీసుకురా వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించారని విశ్వసినీయవర్గాల బోగట్ట.