Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy : విద్యార్థులకు తీపికబురు, ఓయూ లకు ఫీజు రీయింబర్స్మెంట్

Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: గణతం త్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ యూనివర్సిటీలకు వరాల జల్లులు కురిపించారు. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ప్రొఫెసర్ల ఏజ్ లిమిట్ ను 60 నుంచి 65కు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ల సేవలు యూనివర్సిటీలకు అవసరమని, అందుకోసం ఏజ్ లిమిట్ పెంచనున్నట్లు తెలిపారు.

 

హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం.. యూనివర్సిటీలను సమాజానికి కావాల్సిన నాయకత్వాన్ని తయారు చేసే వేదికలుగా తయారు చేస్తామని అన్నారు. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ అమలు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుం దని, చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలు వేదిక మీది నుంచి జారీ చేస్తున్నట్లు తెలిపారు.