–అసెంబ్లీలో సంతాపత్ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో దివంగత శాసన సభ్యు రాలు (Late MLA)లాస్య నందిత సంతాప తీర్మా నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రవేశపెట్టారు. మంగళవారం ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమా వేశాల్లో ఈ మేరకు సంతాప తీర్మా నాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవం త్ రెడ్డి మాట్లాడుతూ సాయన్న అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎది గారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఆయ న ప్రజా జీవితంలోనే మరణిం చార ని, సాయన్న వారసురాలిగా కుమా రి లాస్య నందితను ప్రజలు కంటో న్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు.
కానీ ప్రమాదవశాత్తు లాస్య (lasya) మర ణించడం బాధాకరమని అన్నారు.సాయన్న మృదుస్వభావి అని రాజకీయాలకు అతీతంగా అంద రితో కలిసి ఉండేవారని చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ ఎంసీలో (ghmc) కలపాలన్న సాయన్న కోరికగా ఉండేదని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు అది నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేరని, కనీసం లాస్య నందిత బ్రతికి ఉన్నా ఆయన సంతోషించి ఉండే వారని విచారం వ్యక్తం చేశారు.కీలకమైన సమయంలో వారు మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు.వారు మన మధ్య లేక పోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. వారి ఆశయాలను, వారు చేయాలనుకున్న పనులను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళు తుందని స్పష్టం చేశారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సాను భూతి ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని తెలిపారు.