Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy : విశ్వవిద్యాలయాలపై కేంద్రం పెత్త నాన్ని సహించబోo

— సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్:రాష్ట్రాల పరిధిలో ఉండే విశ్వవిద్యాలయా లపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను చూస్తు ఊరుకోబోమని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ విషయంలో తమిళనాడు, కర్ణా టక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రులతో మాట్లాడాలని భావిస్తు న్నట్టు చెప్పారు. 32 ఏళ్ల తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మొదటి ముఖ్యమంత్రి గా క్యాంప స్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పా టు కొత్తగా నిర్మించనున్న మూడు భవనాలకు శంఖుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, యూజీసీ ముసు గులో వర్సిటీలను తమ ఆధీనంలో కి తీసుకోవాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ తీవ్ర నిర సనను వ్యక్తం చేశారు. రాష్ట్రాల వర్సిటీలపై ఆధిపత్యం చెలాయిం చాలని చూడటం సాంస్కృతిక దాడిగా అభివర్ణించారు.

 

 

ఈ విష యంలో మేధావులందరూ ఆలోచ నలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రాల అధికారాల విష యంలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ దాని స్ఫూర్తికి విరుద్ధం గా చేసే ప్రయత్నాలపై సమిష్టిగా కోట్లాడుతామని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కుట్రను మా పై దాడిగానే భావిస్తాం. ఆ ప్రతిపా దనను తక్షణం ఉపసంహరించు కోవాలి. ఒక్కొక్కటిగా ఇలా చేస్తూ పోతే చివరకు స్థానిక సంస్థలు, ము న్సిపాలిటీలు, జిల్లా పరిషత్ లు కేవలం పన్నులు వసూలు చేసుకు నే సంస్థలుగా మిగిలిపోతాయి.

 

 

కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ముఖ్య మంత్రిగా బాధ్యత తీసుకున్న మ రుక్షణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చానో విశ్వవిద్యాలయాల వీసీ ల నియామకానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాం.వర్సిటీ వీసీల నియామకంలో సామాజిక న్యా యం అనే కోణానికి కూడా ప్రాధా న్యతనిచ్చాం. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూ నివర్సిటీకి దాని చరిత్రలో ఏ రోజూ ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వైస్ ఛాన్సలర్ గా ని యమించబడలేదు. ఆ సామాజిక వర్గం నుంచి విద్యావేత్తను వీసీగా నియమించాం.విశ్వవిద్యాలయాల పునర్నిర్మాణం జరగాలి. మన కళ్ళ ముందే వాటి ప్రతిష్ట దిగజారుతుం టే చూస్తూ ఊరుకుంటే మనం ఈ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం.

 

 

 

ఓపెన్ యూనివ ర్సిటీ విద్యార్థులకు ఫీజు రీయింబ ర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరాలు తెప్పిం చుకుని సానుకూల నిర్ణయం తీసు కుంటారు.అనుభవం కలిగిన అధ్యాపకుల సేవలను వినియో గించుకోవాలన్న ఆలోచన చేస్తు న్నాం. వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలన్న ఆలోచన ఉంది. ఈ కా ర్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభా కర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి. బాలకి ష్టారెడ్డి, వర్సిటీ వీసీ ఘంటా చక్రపా ణి తో పాటు ప్రొఫెసర్లు, మేధావు లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొ న్నారు.