–బీసీసీఐతో ఇప్పటికే పూర్తయిన ప్రాథమిక చర్చలు
–త్వరలో రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ
–కొత్త పాలసీతో క్రీడాకారులకు మెరుగైన ఉద్యోగ భద్రత
–అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో మరో మహానగరం ‘ముచ్చర్ల ‘ నిర్మాణానికి శ్రీకారం చు ట్టిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెనువెంటనే కార్యదీక్ష చేపట్టారు. ముఖ్యమం త్రిగా తన ఆకాంక్ష అయినటువంటి ముచ్చర్ల నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో (International standards) కూడిన స్టేడియం నిర్మించడానికి కార్యాచరణ చేపట్టారు. ఈ విషయoలో ఇప్ప టికే బీసీసీఐ తో ప్రాథమిక చర్చలు జరిపి కోరినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో స్పోర్ట్స్ బిల్లు పై చర్చ జరిగిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)మాట్లాడుతూ స్టేడి యం నిర్మించే బాధ్యత బీసీసీఐదే అని చెప్పారు. ఇప్పటికే ప్రాథమిక చర్చలు ముగిశాయన్నారు. కావా ల్సిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు.క్రీడాకారులకు ప్రో త్సాహకాలు క్రీడాకారులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. క్రీడల్లో రాణించేవారికి ప్రోత్సాహకాలను ఇస్తామన్నారు. స్పోర్ట్స్ కోసం రూ.361 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ప్రతి మండలాని కి ఒక మినీ స్టేడియం నిర్మిస్తామన్నా రు.
పాలసీతో క్రీడాకారులకు (For sportsmen) ఉద్యో గ భద్రత.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు సహకారం, ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోనే అ త్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసు కురాబోతున్నట్లు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. చదువు లోనే కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని, కు టుంబ గౌరవం పెరుగుతుందనే నమ్మకం యువతలో కలిగిస్తామ న్నారు.తెలంగాణ క్రీడారత్నాలైన బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మొహ్మ ద్ సిరాజ్ గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అం శం పై శాసనసభలో చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. నెట్ జీరో సిటీలో స్కిల్ యూని వర్సిటీ, హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ తోపాటు స్పోర్ట్స్ హబ్ (Sports Hub) ఏర్పా టుకు కూడా చర్యలు తీసుకుంటు న్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్పోర్ట్స్ యాక్టివిటీలు పెరిగేలా క్రీడా ప్రాంగణాల నిర్మా ణా నికీ ప్రణాళికలు సిద్దం చేస్తు న్నామ ని ముఖ్యమంత్రి తెలిపారు. యువ త మత్తు పదార్థాల బారిన పడకుం డా క్రీడలు ఉపకరిస్తాయని ఈ సందర్భంగా సీఎం అన్నారు.శాసనసభ్యులు కూడా తమ క్రీడా స్ఫూర్తిని కూడా చాటుకునేలా ఇకపై ప్రతి బడ్జెట్ సెషన్ లో కార్య క్రమాలు నిర్వహించే సంప్రదాయా న్ని పునరు ద్ధరించే అంశంపై అఖిల పక్షంతో మాట్లాడి నిర్ణయం తీసు కుంటామని ముఖ్యమంత్రి చెప్పా రు.