Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: జనగామ జిల్లా బాలుడి చికిత్స ప్రభుత్వ బాధ్యత

— సీఎం ముఖ్యమంత్రి ఆదేశాలతో నిధులు, చికిత్సకు ఏర్పాట్లు

Revanth Reddy: ప్రజా దీవెన, జనగాం: జన్యు సంబంధిత వ్యాధితో (Genetic disease) బాధపడుతోన్న రెండున్నరేండ్ల బాలుడు మాధవన్ ఆరోగ్య బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)గారి ఆదేశాలతో ఆ బాలుడికి అవసరమైన శస్త్రచికిత్స, అందుకు అవసరమైన నిధుల విడుదలకు ప్రభుత్వం (government)ఏర్పాట్లు చేసింది. జనగామ జిల్లా జఫర్ గఢ్ మండలం తిమ్మంపేటకు చెందిన కుంభోజు మహేశ్వర్-అలేఖ్య (Maheshwar-Alekhya) దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు మాధవన్ ఆరోగ్య పరిస్థితిపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనానికి ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి, తక్షణ సాయానికి ఆదేశించింది. ఆ మేరకు సంబంధిత అధికారులు బాలుడి తల్లిదండ్రులను సంప్రదించి, వారి సమ్మతితో హైదరాబాద్ నిమ్స్ వైద్యులతో (Hyderabad Nims Doctors) మాట్లాడి, చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ కు అవసరమయ్యే నిధులను ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అందించాలని నిర్ణయించారు.