Revanth Reddy : ప్రజా దీవెన నాంపల్లి : రాజా దీవెన జనవరి 12 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన త్రిఫ్టు ఫoడ్ మరియు బీమా ఏర్పాటు చేయడంతో చేనేత కార్మికులు ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటాలతో ఫ్లెక్సీ తయారుచేసి మూకుమ్మడిగా నాంపల్లి పట్టణం చేనేత కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు వారు ప్రత్యేకంగా ప్రతినిధితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్ణయం చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నిండిందని పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు చేనేత కార్మికులను గత ప్రభుత్వాలు విస్మరించాయని దీనితో కార్మికులు.
ఆత్మహత్య నిర్ణయాలు తీసుకున్నారని ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నిర్ణయంతో కార్మికులకు భీమ భరోసా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ చేనేత కార్మికులు సంఘపు గణేష్ రాము మల్లేష్ లక్ష్మణ్ , పిల్లల మర్రి రంగయ్య గుర్రం శ్రీరాములు గుర్రం భరతయ్య గుర్రం గణేష్ గుర్రం వెంకటేశ్వర్లు రుద్ర వెంకటేశ్వర్లు తిరందాస్ వెంకటేష్ తదితరులు పాల్గొని ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకొని మిఠాయిలు పంచారు