*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటాలకు పాలాభిషేకం.
*వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ దశరథ్..
Revanth Reddy: ప్రజా దీవెన, కోదాడ:తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోదాడ ప్రభుత్వ వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ దశరథ్ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో టి వి వి పి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ వెలుగు కరుణాకర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) , ఫ్లెక్సీ లకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఇ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా కాలం నుండి వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. వైద్య విధాన పరిషత్ (Medical Policy Council) ను రద్దు పరచి సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా (Health Services) మార్చాలని, ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని కోరుతున్నమని, రిక్రూట్మెంట్ అయినా కాంట్రాక్టు ఉద్యోగుల (Contract employees) సర్వీసును క్రమబద్ధీకరించాలని , ఐదు అంచెల స్థాయిలో ప్రమోషన్స్ కల్పించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో డి సి హెచ్ ఎస్ కార్యాలయం లో తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని, వైద్య విధాన పరిషత్ కు కేటాయించిన వైద్యశాలలకు , పడకల సంఖ్యను పెంచిన వైద్యశాలలకు క్యాడర్ స్ట్రంగ్త్ ను ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అన్ని క్యాడర్లకు ప్రమోషన్స్ ఇవ్వాలని,317 వ జీవో కింద అలాట్మెంట్ అయినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఈ సమస్యలు చాలా కాలం నుండి వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను వేధిస్తున్నాయి. ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులకు గురి అవుతున్నారని. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ఉద్యోగుల పట్ల సానుభూతితో సమస్యలు పరిష్కరించుటకు ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తున్నందుకు మేమందరము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, తొందర్లోనే ఈ అంశాలపై ప్రభుత్వం నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాము.మా పట్ల సానుభూతితో మా సమస్యలు పరిష్కరిస్తున్నందుకు ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి కి (Minister of Health) పాలాభిషేకం చేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మమత , హెడ్ నర్సు మంగమ్మ, ఇతర నర్సులు, మినిస్ట్రీయల్ స్టాప్ సతీష్ , రమేష్ , శంకర్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.