–బడ్జెట్లో తెలంగాణ పదo లేనే లేదు
–తెలంగాణ మీద ఇంతటి కక్ష ఎందుకో చెప్పాలి
–తెలంగాణ ప్రజలు బిజెపికి ఎని మిది సీట్లిచ్చారనిగుర్తుంచుకోండి
–కిషన్రెడ్డి బాధ్యత తీసుకొని మం త్రి పదవికి రిజైన్ చేయాలి
–ఇదే వివక్ష కొనసాగిస్తే తెలంగాణ లో బీజేపీకి నూకలు చెల్లుతాయ్
–కేంద్ర బడ్జెట్పై నిప్పులు చేరిన ముఖ్యమంత్రి రేవంత్ నిప్పులు
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రం పట్ల మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవ హరించిందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివక్ష తో వ్యవహరిస్తే ఇక తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు. ప్రధానమంత్రి తన కుర్చీని కాపాడుకునేందుకు ఏపీ, బిహార్కు మాత్రమే నిధులు కేటా యించారని పేర్కొంటూ కేంద్ర బడ్జెట్ను (Central budget) ‘కుర్చీబచావో బడ్జెట్’గా అభివర్ణించారు. ఇది పూర్తిగా క్విడ్ప్రోకో విధానంలా ఉందని, ఇలాంటి చర్యలు ప్రధానికి గౌరవా న్ని తెచ్చిపెట్టవన్నారు. సీఎం రేవం త్రెడ్డి మంగళవారం తన నివాసం లో విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ కేంద్ర బడ్జెట్పై నిప్పులు చెరి గారు. బడ్జెట్ సారాంశాన్ని చూస్తే తెలంగాణ అనే పదాన్ని నిషేధిం చినట్లు ఉంది. అసలు ఆ పదాన్ని పలకడానికి కూడా కేంద్రం ఇష్టప డటం లేదని తెలుస్తోంది. రాష్ట్రాభి వృద్ధికి నిధులు ఇవ్వాలని ముఖ్య మంత్రిగా నేను మూడుసార్లు, మం త్రులు 18 సార్లు ప్రధానమంత్రి నరేం ద్రమోదీని, కేంద్రంలోని మంత్రులను కలిశాం. కేంద్రంతో వివాదాలు లేకుం డా సత్సంబంధాలు కొనసాగించా లని, ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సమయంలో పెద్దన్నలా వ్యవహరిం చాలని కోరాం. కానీ, ఈ విజ్ఞప్తుల ను ఏమాత్రం పట్టించుకోలేదు. బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యా యం జరిగింది.
కేంద్రం తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిం చింది. ఇక్కడి ప్రజల మీద వివక్ష ఎందుకు ఇంతటి కక్షపూరిత వైఖరి ని, వివక్షను ఎన్నడూ చూడలేదు’ అని రేవంత్ (revanth reddy) పేర్కొన్నారు. 10వ బడ్జెట్ సమయంలోమోదీ రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ.. తల్లిని చంపి పిల్లను బతికించారని అన్న ప్పుడే ఆయనకు తెలంగాణ ఏర్పా టు ఇష్టం లేదని తెలిసినా, ప్రధాని మనసులో తమపై ఇంతటి కక్ష గూడుకట్టుకొని ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదన్నారు. ఆంధ్రప్ర దేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించిన కేంద్రం, అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వలేదని సీఎం ప్రశ్నించారు. ఏపీలో రాజధాని అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు చేసినప్పుడు.. తెలంగాణలో విభ జన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల, ములుగు గిరిజన విశ్వవిద్యాల యం (Bayyaram Steel Industry, Khajipet Coach Factory, Palamuru, Rangareddy Uppituthala, Mulugu Tribal University) ఏర్పాటుకు ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు. ఏపీకి ఎందుకిచ్చారని తాము అడగటం లేదని.. తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారన్నదే తమ ఆవేదన అని రేవంత్రెడ్డి తెలిపారు. గంగానది ప్రక్షాళనకు, గుజరాత్లో సబర్మతి తీరప్రాంత అభివృద్ధికి నిధులు ఇచ్చిన కేంద్రం తెలంగాణలో మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి, రీజినల్ రింగు రోడ్డుకు, హైదరాబాద్ మెట్రోకు, ఐటీఐఆర్ కారిడార్కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు.
ఇదిలా ఉండగా రూ.48.21 లక్షల కోట్ల బడ్జెట్లో కేంద్రం తెలంగాణ (telangana)పట్ల చూపిన వివక్షతో బీజేపీ ప్రచారం చేసుకుంటున్న ‘సబ్ కా వికాస్’ అనేది బోగస్ అని రుజువైందని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తెలం గాణ ప్రజలు బీజేపీని 8 స్థానాల్లో గెలిపించారని, బీజేపీకి ఈ ప్రాంత ఓట్లు, సీట్లు కావాలేగానీ తెలంగాణ అభివృద్ధి పట్టదని దుయ్యబట్టారు. తెలంగాణ బిడ్డగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కిషన్రెడ్డికి ఏ మా త్రం ఆత్మగౌరవం ఉన్నా.. తెలంగాణ కు జరిగిన అన్యాయంపై నిరసనగా తక్షణమే మంత్రి పదవికి రాజీనా మా చేయాలన్నారు. మూడు రోజు ల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి ఒక లేఖ వచ్చిందని, తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు వీలు కాదని ఆ లేఖలో తెలిపారన్నారు. ఐఐఎం ఇవ్వబోమ ని కేంద్రం చెప్పినా కిషన్రెడ్డి మోదీ క్యాబినెట్లో ఎందుకు కొనసాగాల ని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొదన్నారు. తెలంగా ణ హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుందన్నా రు. తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోం దన్నారు. విభజన చట్టం కేవలం ఏపీకే కాదని.. తెలంగాణకు కూడా వర్తిస్తుందనీ సీఎం గుర్తు చేశారు. బడ్జెట్ను సవరించే సమయంలో నైనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు. ఇదే వివక్ష కొనసాగితే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినట్లేనన్నారు.మీడియా సమావేశం లో మంత్రులు దామోద ర్ రాజన ర్సింహ, పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభు త్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.