–తెలంగాణ సివిల్స్ అభ్యర్థులకు సరికొత్త పథకం
–సింగరేణి ద్వారా రూ. లక్ష ఆర్ధిక సాయం
–రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహ స్తం ప్రారంభం
–తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజాదీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సివిల్స్ అభ్యర్థులకు (civil candidates) చేయూతనిచ్చేలా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ‘రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం’ (Rajiv Gandhi Civil Defense) పథకాన్ని ప్రజా భవన్లో శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ తరఫున సాయం చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులు కచ్చితంగా ఉద్యోగం (job) సాధించాలని ఆకాంక్షించారు. సివిల్స్ సాధించి మన రాష్ట్రానికే రావాలని.. ఐఏఎస్, ఐపీఎస్లు మన వారైతే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు.
‘నిరుద్యోగుల బాధలు తెలుసు’
ఉద్యోగాల కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ‘నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. త్యాగాల పునాదులపై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. నిరుద్యోగుల (unemployement)సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. అందుకే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. అధికారంలోకి రాగానే యూపీఎస్సీ (UPSC)తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించాం. డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగుల బాధలు మాకు తెలుసు. పరీక్షలు మాటిమాటికీ వాయిదా పడడం మంచిది కాదు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్ – 2 పరీక్ష వాయిదా వేశాం. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9 లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం.’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.