–అయ్యలు పేర్లు చెప్పి రాలేదన్న సిఎం రేవంత్ రెడ్డి
–పేమేంట్ సీటులో వచ్చింది మీరే నంటూ కెటిఆర్ కౌంటర్
–ఇలాంటి చర్చ లకు తాము చాలం టూ బిఆర్ఎస్ చురకలు
–కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అ న్యాయం తీర్మానానికి బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
Revanth vs KTR:ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్రబ డ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీలో నేడు జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth), బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (ktr) మధ్య వాడీ వేడిగా మాటల యుద్దం సాగింది. రేవంత్ వర్సెస్ కేటీఆర్ (revanth vs ktr) మధ్య కౌంటర్, ప్రతి కౌంటర్ల మధ్య సభ కొద్ది సేపు వేడేక్కింది. ఈ చర్చపై ముందుగా రేవంత్ మాట్లాడుతూ కీలకమైన చర్చ జరుగుతుంటే కేసీ ఆర్ సభకు (KC R Sabha)ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీయాల్సి న సమయంలో సభకు రాలేదని వి మర్శించారు. మోదీ చూస్తే ఏమైనా అవుతుందేమోనని భయపడుతు న్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో కేసీఆర్ కుటుంబం సభను తప్పుదోవ పట్టించే ప్రయ త్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కేం ద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ తమ నిర్ణ యం చెప్పాలన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకొని వచ్చిందే మీ అభిప్రాయమా అని చురక అంటించారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నా రని ఆరోపించారు. తాము అయ్య లు, తాతల పేర్లు చెప్పుకొని పైకి రాలేదని, స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగామన్నారు రేవంత్ రెడ్డి.
రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఉటంకిస్తు న్నారా.. తమకు ఈ చర్చకు సంబంధించి తీర్మానం కాపీ అందలే దని కేటీఆర్ అన్నారు. చర్చకు కేసీఆర్ అవసరం లేదని, తామే చాలన్నారు. సీఎంకు (cm)ఓపిక, సహ నం ఉండాలని సూచించారు. అయ్యలు, తాతలు అంటూ ముఖ్యమంత్రి అంటున్నారని, అనాలనుకుంటే పేమెంట్ కోటాలో పదవి కొట్టేశారని తాము కూడా అనవచ్చునని చురక అంటించారు. అయ్యల పేర్లు, తాతల పేర్లు చెప్పు కొని వచ్చారని ముఖ్యమంత్రి అంటున్నారని, ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి ఉటంకిస్తున్నారా అని కౌంటర్ ఇచ్చారు. ఈ సంద ర్భంగా స్పీకర్ (speaker) ను ఉద్దేశించి మీరు మాకు మాత్రమే చెబుతున్నారని, కానీ అధికార పార్టీని వారించడం లేదని అన్నారు.
బడ్జెట్లో అన్యాయం చర్చను సమర్థిస్తున్నాం… కేంద్ర బడ్జెట్లో (Central budget) రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న చర్చను తాము పూర్తిగా సమర్థిస్తు న్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో మనకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ అనే పదం కూడా రాలేదని కాంగ్రెస్ నేతలు చెబుతు న్నారని, అందుకు అక్కడ బీఆర్ ఎస్ లేకపోవడమేనని కేటీఆర్ అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8 సీట్లలో గెలిచిన నేపథ్యంలో కేటీఆర్ (ktr)మాట్లాడుతూ సాధారణంగా 8+8=16 అవుతుం దని, కానీ ఇక్కడ మనకు జరిగింది మాత్రం గుండు సున్నా అని చురక అంటించారు. నిన్నటి బడ్జెట్ (budget)చూ శాక తెలంగాణలోని ప్రతి బిడ్డకు మనకు జరిగిన అన్యాయం తెలి సిందన్నారు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సమా ధానం చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేంద్రంతో సఖ్యతగా లేనం దువల్లే మనకు నిధులు రాలేదని గతంలో ముఖ్యమంత్రి అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలని నిలదీశారు. ఢిల్లీ తత్వం ఇన్నాళ్లకు బోధపడింద న్నారు. తెలంగాణ హక్కులు ఎవరు కాలరాసినా మెడలు వంచుతామ న్నారు. విభజన సమయంలో తెలం గాణ హక్కుల కోసం పోరాడామని, మోదీ ప్రభుత్వంపై పోరాడామని ఇప్పుడూ పోరాడుతామన్నారు. సభా నాయకుడు ఇష్టారీతిన విమ ర్శలు చేయడం సరికాదంటూ రేవం త్ కు ధీటు సమాధానం చెప్పారు కెటిఆర్.